మంత్రి ఆదిమూలపు సురేష్ కాన్వాయ్ ఢీ కొని వ్యక్తి మృతి.. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న మృతుని భార్య

By Sumanth KanukulaFirst Published Dec 9, 2021, 1:09 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ (adimulapu suresh) కాన్వాయ్ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ప్రమాదంలో మృతుని భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని పెద్దారవీడు మండలం గొబ్బూరు సమీపంలో చోటుచేసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో (prakasam district) రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ (adimulapu suresh) కాన్వాయ్ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ప్రమాదంలో మృతుని భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన జిల్లాలోని పెద్దారవీడు మండలం గొబ్బూరు సమీపంలో చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న బైక్‌ను మంత్రి ఆదిమూలపు సురేష్ కాన్వాయ్‌లోని ఓ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 38 ఏళ్ల మహేష్ అనే వ్యక్తి మృతిచెందాడు. అతని భార్య‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

click me!