ఏనుగుతో సెల్ఫీ తీసుకోబోయి..

Bukka Sumabala   | Asianet News
Published : Dec 30, 2020, 10:41 AM IST
ఏనుగుతో సెల్ఫీ తీసుకోబోయి..

సారాంశం

గున్న ఏనుగును కాపాడారు.. సెల్ఫీలు దిగారు.. చివరికి తల్లి ఏనుగు కోపానికి గురయ్యారు. అయితే ఈ ఘటనలో తనకేం సంబంధం లేని వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో ఈ ఘటన జరిగింది.

గున్న ఏనుగును కాపాడారు.. సెల్ఫీలు దిగారు.. చివరికి తల్లి ఏనుగు కోపానికి గురయ్యారు. అయితే ఈ ఘటనలో తనకేం సంబంధం లేని వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో ఈ ఘటన జరిగింది.

ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని సుర్లా– స్వర్ణాపురం తీరంలో తల్లి ఏనుగుదాడిలో ఒడిశాకు చెందిన యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం కేశుపురం, బూర్జపాడు, లక్ష్మీపురం గ్రామ పరిసరాల్లో మూడురోజులుగా ఏనుగుల గుంపు సంచరిస్తోంది. ఈ గుంపు మంగళవారం ఒడిశా రాష్ట్రానికి చేరుకుంది. 

సుర్లా–స్వర్ణాపురం తీరంలో స్థానికంగా ఉన్న బాహుదానదిని ఏనుగుల గుంపు దాటుతుండగా ఓ చిన్న ఏనుగు గుమ్మిలో చిక్కుకుపోయింది. ఈ విషయాన్ని స్థానిక యువకులు గమనించారు. ఆ ఏనుగును ఒడ్డుకు తీసుకొచ్చి సెల్ఫీలు దిగారు. అయితే పిల్ల ఏనుగును ఏదో చేస్తున్నారని భావించిన తల్లి ఏనుగు కోపానికి వచ్చింది. ఆగ్రహంతో వెనక్కి తిరిగి వచ్చింది. 

దీంతో ఆ యువకులు పరుగులు తీశారు. అదే సమయంలో నదిలో చేపలు పడుతున్న ఒడిశా యువకుడు ఏనుగు రాకను గమనించకపోవడంతో అక్కడే ఉండిపోయాడు. దీంతో ఏనుగు అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. 
 

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu