స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ, నామినేషన్ దాఖలు చేసిన తమ్మినేని

Siva Kodati |  
Published : Jun 12, 2019, 04:49 PM IST
స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ, నామినేషన్ దాఖలు చేసిన తమ్మినేని

సారాంశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి నూతన స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. బుధవారం సాయంత్రం 5 గంటలలోపు నామినేషన్ దాఖలు చేయాల్సిందిగా ప్రొటెం స్పీకర్ శంబంగి చిన వెంటక అప్పలనాయుడు ప్రకటించారు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి నూతన స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. బుధవారం సాయంత్రం 5 గంటలలోపు నామినేషన్ దాఖలు చేయాల్సిందిగా ప్రొటెం స్పీకర్ శంబంగి చిన వెంటక అప్పలనాయుడు ప్రకటించారు.

స్పీకర్‌గా ఇప్పటికే తమ్మినేని సీతారాం పేరును వైఎస్ జగన్ ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన నామినేషన్ సైతం దాఖలు చేశారు. ఆయన అభ్యర్ధిత్వాన్ని బలపరుస్తూ 30 మంది సభ్యులు మద్ధతు పలికారు.

స్పీకర్‌గా తమ్మినేని ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ నేపథ్యంలో గురువారం తమ్మినేని స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఏపీలో దేశంలోనే తొలి క్వాంట‌మ్ వ్యాలీ.. ఆ ప్రాంతంలో స‌రికొత్త విప్ల‌వం
Andhra pradesh: ఆమెకు 37, అతడికి 17 ఏళ్లు.. ఆంధ్రప్రదేశ్‌లో దారుణ సంఘ‌ట‌న‌