
శ్రీకాకుళం: శ్రీకాకుళం మండలంలోని చాపురం పంచాయితీ పరిధిలోని బొందిలిపురం విజయ్నగర్ కాలనీలో ఈ నెల 7వ తేదీన హత్యకు గురైన మెహరున్నీషా, జురాబాయ్ల కేసు మిస్టరీ వీడలేదు.
వీరిద్దరూ హత్యకు గురై ఐదు రోజులు కావస్తోన్నా ఈ కేసులో ఎలాంటి పురోగతి కన్పించలేదు. మృతదేహాలపై హంతకుల వేలిముద్రలు లభించలేదు. ఈ హత్యలు జరిగిన రోజున ఇంట్లో నుండి ఉన్న నగలను మాత్రం దుండగులు పట్టుకెళ్లలేదు. పోలీసుల దర్యాప్తులో ఈ విషయాన్ని గుర్తించారు.
ఈ హత్యలు పోలీసులకు సవాల్గా మారింది. ఈ హత్యలకు కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. ఆస్తి తగాదాలా.... ఇంకా మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఇంటికి హత్య జరిగిన రోజున ఎవరెవరు వచ్చారనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రతి ఒక్కరిని పోలీసులు విచారిస్తున్నారు.