ఆ జంట హత్యల మిస్టరీ ఇంకా వీడలేదు

Published : Feb 12, 2019, 11:45 AM IST
ఆ జంట హత్యల మిస్టరీ ఇంకా వీడలేదు

సారాంశం

శ్రీకాకుళం మండలంలోని చాపురం పంచాయితీ పరిధిలోని బొందిలిపురం విజయ్‌నగర్ కాలనీలో  ఈ నెల 7వ తేదీన హత్యకు గురైన మెహరున్నీషా, జురాబాయ్‌ల కేసు మిస్టరీ వీడలేదు.  

శ్రీకాకుళం: శ్రీకాకుళం మండలంలోని చాపురం పంచాయితీ పరిధిలోని బొందిలిపురం విజయ్‌నగర్ కాలనీలో  ఈ నెల 7వ తేదీన హత్యకు గురైన మెహరున్నీషా, జురాబాయ్‌ల కేసు మిస్టరీ వీడలేదు.

వీరిద్దరూ హత్యకు గురై ఐదు రోజులు కావస్తోన్నా ఈ కేసులో ఎలాంటి పురోగతి కన్పించలేదు. మృతదేహాలపై  హంతకుల వేలిముద్రలు లభించలేదు.  ఈ  హత్యలు జరిగిన రోజున ఇంట్లో నుండి  ఉన్న నగలను మాత్రం దుండగులు పట్టుకెళ్లలేదు.  పోలీసుల దర్యాప్తులో ఈ విషయాన్ని గుర్తించారు.  

ఈ హత్యలు పోలీసులకు సవాల్‌గా మారింది.  ఈ హత్యలకు కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. ఆస్తి తగాదాలా.... ఇంకా మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో  కూడ  పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఇంటికి  హత్య జరిగిన రోజున ఎవరెవరు వచ్చారనే కోణంలో కూడ పోలీసులు  ఆరా తీస్తున్నారు.  ప్రతి ఒక్కరిని  పోలీసులు విచారిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే