ఇంటి నుంచి పారిపోయి ప్రియుడిని పెళ్లాడిన యువతి.. మంత్రి రోజా నుంచి ప్రాణహనీ , డీజీపీకి ఫిర్యాదు

Siva Kodati |  
Published : Nov 16, 2023, 05:42 PM IST
ఇంటి నుంచి పారిపోయి ప్రియుడిని పెళ్లాడిన యువతి.. మంత్రి రోజా నుంచి ప్రాణహనీ , డీజీపీకి ఫిర్యాదు

సారాంశం

ఏపీ మంత్రి, వైసీపీ నేత రోజా నుంచి తమకు ప్రాణహానీ వుందంటూ ఓ ప్రేమజంట చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మంత్రి నుంచి తమకు రక్షణ కల్పించాలని వారు పోలీసులను ఆశ్రయించారు. తమకు ఏదైనా జరిగితే దానికి మంత్రి రోజాదే బాధ్యత అని అన్నారు.

ఏపీ మంత్రి, వైసీపీ నేత రోజా నుంచి తమకు ప్రాణహానీ వుందంటూ ఓ ప్రేమజంట చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మంత్రి నుంచి తమకు రక్షణ కల్పించాలని వారు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన ప్రవీణ, నెల్లూరుకు చెందిన జిలానీలు ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇద్దరి మతాలు వేరు కావడంతో ప్రవీణ తల్లిదండ్రులు వీరి ప్రేమ వివాహానికి అంగీకరించలేదు.

అంతేకాదు.. ప్రవీణకు వేరే సంబంధాలు వెతకడం మొదలుపెట్టారు. దీనిని గమనించి ఆమె ఇంటి నుంచి పారిపోయి.. జిలానీని రహస్యంగా పెళ్లి చేసుకుంది. అయితే తమకు మంత్రి రోజా నుంచి ప్రాణహానీ వుందని.. పోలీసులు తమకు రక్షణ కల్పించడకుండా ఆమె ఒత్తిడి చేస్తున్నారని ప్రేమజంట ఆరోపిస్తోంది. తమకు ఏదైనా జరిగితే దానికి మంత్రి రోజాదే బాధ్యత అని అన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.     

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Meenakshi Kalyanam Festival: కన్నులపండుగలా మధురైమీనాక్షి అమ్మవారికళ్యాణమహోత్సవం| Asianet News Telugu
ఎక్కడికివెళ్లినా NOPETROL STOCK బోర్డులే | కూటమి పై Devineni Avinash Comments | Asianet News Telugu