రూ.300 కోట్లు ఇవ్వాలి: కేసీఆర్‌ సర్కార్‌పై కోర్టుకెక్కిన రాయపాటి

Siva Kodati |  
Published : Feb 25, 2019, 05:58 PM IST
రూ.300 కోట్లు ఇవ్వాలి: కేసీఆర్‌ సర్కార్‌పై కోర్టుకెక్కిన రాయపాటి

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు నరసారావుపేట టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులను కేసీఆర్ సర్కార్ వేధిస్తోందన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు నరసారావుపేట టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులను కేసీఆర్ సర్కార్ వేధిస్తోందన్నారు.

టీఆర్ఎస్ నేతల ఒత్తిడి వల్లే కొంతమంది పార్టీ మారుతున్నారని రాయపాటి ఆరోపించారు. కేసీఆర్ నమ్మకద్రోహి అని, ఆయన ఎన్ని బెదిరింపులకు పాల్పడినా లొంగేది లేదన్నారు.

మోడీ, కేసీఆర్, జగన్ కలిసిన చంద్రబాబును ఏం చేయలేరని  సాంబశివరావు స్పస్టం చేశారు. ఎంతమంది ఎన్ని కుట్రలు పన్నినా చంద్రబాబే మళ్లీ సీఎం అవుతారని రాయపాటి జోస్యం చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం నుంచి తన కంపెనీకి రూ.300 కోట్లు పరిహారంగా అందాల్సి వుందని, కానీ ఎన్నిసార్లు అడిగినా స్పందించడం లేదన్నారు. దీంతో కోర్టును ఆశ్రయించినట్లు  సాంబశివరావు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి మొహర్రం సెలవు ఉన్నట్లా, లేనట్లా? క్లారిటీ వచ్చేదెలా?
Gade Sai Krishna Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం సీఐ నాగరాజు అరెస్ట్ | Asianet News Telugu