మా అమ్మ ఆశయంతోనే ఈ హాస్పిటల్స్ ఏర్పాటు: బాలకృష్ణ

Published : Feb 14, 2019, 01:57 PM ISTUpdated : Feb 14, 2019, 02:07 PM IST
మా అమ్మ ఆశయంతోనే ఈ హాస్పిటల్స్ ఏర్పాటు: బాలకృష్ణ

సారాంశం

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఎవరూ చనిపోకూడదనే తమ తల్లి స్వర్గీయ బసవతారకం కోరుకునేవారని ప్రముఖ సినీ నటులు, బసవతారకం ఆస్పత్రి చైర్మన్ బాలకృష్ణ తెలిపారు. ఆ ఆశయంతోనే గతంలో హైదరాబాద్ లో ఆమె పేరుతోనే ఆస్పత్రి ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి లో కూడా బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాప చేయడం ఆనందంగా వుందన్నారు. అతి త్వరలో ఈ ఆస్పత్రి ఏపి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని బాలకృష్ణ హామీ ఇచ్చారు.    

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఎవరూ చనిపోకూడదనే తమ తల్లి స్వర్గీయ బసవతారకం కోరుకునేవారని ప్రముఖ సినీ నటులు, బసవతారకం ఆస్పత్రి చైర్మన్ బాలకృష్ణ తెలిపారు. ఆ ఆశయంతోనే గతంలో హైదరాబాద్ లో ఆమె పేరుతోనే ఆస్పత్రి ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి లో కూడా బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాప చేయడం ఆనందంగా వుందన్నారు. అతి త్వరలో ఈ ఆస్పత్రి ఏపి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని బాలకృష్ణ హామీ ఇచ్చారు.  

అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు గ్రామంలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఇవాళ శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  బాలకృష్ణ మాట్లాడుతూ...దేశంలోని ప్రతిష్టాత్మక క్యాన్సర్ సంస్థల్లో బసవతారకం హాస్పిటల్ ఏడో స్థానంలో నిలిచిందని తెలిపారు. దీన్ని బట్టే తాము ఎంత శ్రద్ద,నిబద్దతతో నిరుపేదలకు వైద్య సాయం అందిస్తున్నామో అర్థమవుతుందన్నారు.  

ఇక ఇక్కడ 3 దశల్లో వెయ్యి పడకలతో ఆస్పత్రిని నిర్మిస్తున్నామని వెల్లడించారు. మొదటిదశలో రూ.300 కోట్లతో 300 పడకల హాస్పిటల్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అతి త్వరలో దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వేగంగా నిర్మాణ పనులు చేపడతామని బాలకృష్ణ వెల్లడించారు.  
 
ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ... రాబోయే రోజుల్లో అమరావతి మెడికల్ హబ్ గా మారుస్తానన్నారు. క్యాన్సర్ రోగులను ఆదుకునేందుకే బసవతారకం ఆస్పత్రిని ఇక్కడ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందులో నిరుపేదలకు తక్కువ ధరలకే వైద్యం  అందుబాటులో వుంటుందని చంద్రబాబు పేర్కొన్నారు.   

ఈ శంకుస్థాపన కార్యక్రమంలో బాలకృష్ణ దంపతులు పాల్గొని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.  అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు,  వైద్యులు దత్తాత్రేయుడు నోరి, మంత్రులు నారా లోకేశ్‌, ప్రత్తిపాటి, నక్కా ఆనందబాబు, ఫరూక్‌, ఎంపీ కొనకళ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

PREV
click me!

Recommended Stories

KandulaDurgesh Speech: వన్యప్రాణులను సంరక్షించాలి – ప్రజలప్రాణాలను కాపాడుకోవాలి| Asianet News Telugu
AP Food Commission Strong Warning: మెమోలు గిమోలు అవసరం లేదు తీసేయండి | Asianet News Telugu