(వీడియో) ప్రమాద ఘటన వద్ద చంద్రబాబు

Published : Nov 13, 2017, 11:54 AM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
(వీడియో) ప్రమాద ఘటన వద్ద చంద్రబాబు

సారాంశం

ఇబ్రహింపట్నం వద్ద జరిగిన బోటు ప్రమాద స్ధలానికి చంద్రబాబునాయుడు, అఖిలప్రియ చేరుకున్నారు.

ఇబ్రహింపట్నం వద్ద జరిగిన బోటు ప్రమాద స్ధలానికి చంద్రబాబునాయుడు, అఖిలప్రియ చేరుకున్నారు. జరిగిన ప్రమాదం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సంఘటన జరిగిన వివరాలు తెలుసుకొని, సంఘటన గురించి తెలియగానే స్పందించిన సైదులు, నడికుదురు పిచ్చయ్య, శివయ్యలతో చంద్రబాబు మాట్లాడారు. ప్రమాదానికి దారితీసిన కారణాలను, బోటు నిర్వాహకుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనుమతి లేకపోయినా బోటు తిరుగుతుంటే  చేస్తున్నారంటూ ఉన్నతాధికారులపై మండిపడ్డారు. మృతుల వివరాలు, చికిత్స తీసుకుంటున్న వారి వివరాలతో పాటు గల్లంతైన వారికోసం జరుగుతున్న గాలింపు చర్యలపై ఆరా తీసారు. అయితే మీడియాతో మాట్లాడకుండానే చంద్రబాబు అక్కడి నుండి వెళ్ళిపోయారు. కాగా బోటు నిర్వాహకుడు శేషగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా టిడిపి నేతల ఒత్తిడి వల్ల నదిలో సుమారు 30 బోట్లు తిరుగుతున్న ఉన్నతాధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

PREV
click me!

Recommended Stories

YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu
డ్రెయిన్స్ పొల్యూషన్ లేకుండా చెయ్యండి:Chandrababu on Make Drains Pollution Free| Asianet News Telugu