చంద్రబాబునాయుడు మనస్తాపానికి గురయ్యారు. నంది అవార్డుల విషయంలో జరుగుతున్న వివాదంపై తొలిసారి చంద్రబాబు సోమవారం స్పందించారు. స్ట్రాటజీ కమిటీ సమావేశంలో వివాదంపై మాట్లాడారు. నంది అవార్డుల ప్రకటనపై ఇంత వివాదం రేగుతుందని అనుకోలదంటూ తెగ బాధపడిపోయారు. వివాదాన్ని ముందే ఊహించుంటే అవార్డుల ఎంపికకు కూడా జ్యూరి విధానం బదులు ఐవిఆర్ఎస్ విధానాన్ని అవలంబించి ఉండేవారమని వాపోయారు. ప్రతీ విషయానికీ కులం రంగు పులిమేస్తున్నారంటూ బోల్డు బాధపడిపోయారు. జ్యూరి నిర్ణయం మేరకే అవార్డులను ప్రభుత్వం ప్రకటించందని చెప్పారు.