ప్రధానికి లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణరాజు..

Published : Mar 20, 2021, 02:43 PM IST
ప్రధానికి లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణరాజు..

సారాంశం

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖల యుద్ధం కొనసాగుతోంది. తాగాజా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో లేఖ రాశారు. రాష్ట్రాల్లో ఉచిత పథకాల కారణంగా ఖజానాలు ఖాళీ అవుతన్నాయని అందులో పేర్కొన్నారు. 

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖల యుద్ధం కొనసాగుతోంది. తాగాజా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో లేఖ రాశారు. రాష్ట్రాల్లో ఉచిత పథకాల కారణంగా ఖజానాలు ఖాళీ అవుతన్నాయని అందులో పేర్కొన్నారు. 

కోలుకోలేని అప్పుల్లో రాష్ట్రాల్లో కూరుకుపోతున్నాయని వివరించారు. ప్రభుత్వాలు లబ్ధిదారులను ోటు బ్యాంకుగానే చూస్తున్నాయని లేఖలో రఘురామకృష్ణరాజు తెలిపారు. ోట్ల కోసం నిధులను కూడా ఉచితాలపై తరలిస్తున్నారని ఎంపీ ఫిర్యాదు చేశారు. 

చట్టం ద్వారా ఉచిత పథకాలపై నియంత్రణ తీసుకురావాలని లేఖలో ప్రధానిని కోరారు. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య కేంద్రం వివక్ష ఆరోపణలకు ఇదే మూలమని అందులో పేర్కొన్నారు. ఇటీవల లోక్ సభలోనూ ఎంపీ ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Eid-ul-Fitr 2026 Celebrations in Vijayawada: ఘనంగా ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు | Asianet News Telugu
Chandrababu TTD Visit:దేవాన్ష్ జన్మదినం..తిరుమలశ్రీవారి సేవలోChandrababu Family| Asianet News Telugu