కొడుకుకు వాతలు పెట్టిన తల్లి

Published : Aug 26, 2018, 05:24 PM ISTUpdated : Sep 09, 2018, 11:46 AM IST
కొడుకుకు వాతలు పెట్టిన తల్లి

సారాంశం

భర్తపై కోపాన్ని అభంశుభం తెలియని బాలుడిపై చూపించిందో తల్లి. తాను వెళ్లొద్దన్నా తండ్రికి దగ్గరకు వెళ్లడంతో ఆగ్రహం చెందిన ఆ తల్లి బాలుడిపట్ల అమానుషంగా ప్రవర్తించింది

నెల్లూరు: భర్తపై కోపాన్ని అభంశుభం తెలియని బాలుడిపై చూపించిందో తల్లి. తాను వెళ్లొద్దన్నా తండ్రికి దగ్గరకు వెళ్లడంతో ఆగ్రహం చెందిన ఆ తల్లి బాలుడిపట్ల అమానుషంగా ప్రవర్తించింది. కాళ్లు, చేతులపై వాతలు పెట్టి ఆస్పత్రిపాల్జేసింది. అందర్నీ కలచివేస్తున్న ఈ ఘటన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం సూళ్లూరులో జరిగింది. 

సూళ్లూరుకు చెందిన ఓ మహిళ భర్తతో విడిపోయి కుమారుడితో నివశిస్తోంది. తల్లికి తెలియకుండా తన తండ్రిని చూడటానికి వెళ్లాడు ఆ బాలుడు. తండ్రి దగ్గరకు కొడుకు వెళ్లిన విషయాన్ని తెలుసుకున్న ఆ తల్లి కొడుకు కాళ్లు, చేతులపై వాతలు పెట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన బాలుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు

PREV
click me!

Recommended Stories

Chandrababu Naidu With Bhuvaneshwari at Raj Bhavan ‘At Home’ Event | Asianet News Telugu
‘స్త్రీ శక్తి' లబ్ధిదారులతో సామాన్యుడిలా టికెట్ తీసుకుని ప్రయాణించిన సీఎం | Stree Shakti Scheme