సినీ ఫక్కీలో సెల్‌ఫోన్ల లారీ చోరీ: రూ. 12 కోట్ల విలువైన మొబైల్స్ లూటీ

Published : Aug 26, 2020, 04:35 PM IST
సినీ ఫక్కీలో సెల్‌ఫోన్ల లారీ చోరీ: రూ. 12 కోట్ల విలువైన మొబైల్స్ లూటీ

సారాంశం

చిత్తూరు జిల్లాలోని నగరి సమీపంలో సినీ ఫక్కీలో సెల్ ఫోన్ల లారీని దొంగల ముఠా దోచుకొంది. లారీ డ్రైవర్ ను బెదిరించి ఫోన్లను దోచుకెళ్లారు దొంగలు. ఈ ఘటనపై లారీ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని నగరి సమీపంలో సినీ ఫక్కీలో సెల్ ఫోన్ల లారీని దొంగల ముఠా దోచుకొంది. లారీ డ్రైవర్ ను బెదిరించి ఫోన్లను దోచుకెళ్లారు దొంగలు. ఈ ఘటనపై లారీ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబూరులో ఉన్న ఎంఐ సెల్ ఫోన్ల కంపెనీ నుండి సెల్ ఫోన్లను లోడ్ చేసుకొని వెళ్తున్న లారీని ఆంధ్రప్రదేశ్-తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులో దొంగల లారీ వెనుక నుండి ఢీకొట్టింది. సెల్ ఫోన్ల లారీని నగరికి సమీపంలోకి తీసుకెళ్లి మరో లారీలోకి సెల్ ఫోన్లను లోడ్ చేశారు.  సినీ ఫక్కీలో ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు అనుమానిస్తున్నారు. 

8 వేల సెల్ ఫోన్లను మరో లారీలోకి మార్చుకొన్నారు. ఈ లారీలో సుమారు 16 వేల సెల్ ఫోన్లు ఉన్నట్టుగా పోలీసులు చెప్పారు. దోపీడీకి గురైన సెల్ ఫోన్ల విలువ సుమారు 12 కోట్లు ఉంటుందని అంచనా. దోపీడీకి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

మరో లారీలో సెల్ ఫోన్లను తీసుకొని దొంగలు పారిపోయారు.సెల్ ఫోన్ల లారీని నగరికి సమీపంలో నిందితులు వదిలివెళ్లిపోయారు. తనను తుపాకీతో బెదిరించినట్టుగా సెల్ ఫోన్ల లారీ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 

PREV
click me!

Recommended Stories

రాజ్యసభలో రేణుకా చౌదరి Vs ఉప రాష్ట్రపతి | Andhra Pradesh Capital | Amaravati | Asianet News Telugu
అమరావతి పేరుతో కుంభకోణాలు.. అందుకేవ్యతిరేకిస్తున్నాం | YSRCP MP YV Subbareddy | Asianet News Telugu