బావిలో శవమై తేలిన పావని: చెట్టుకు ఉరేసుకున్న మిత్రుడు మునిరత్నం

Published : Dec 23, 2020, 06:57 AM IST
బావిలో శవమై తేలిన పావని: చెట్టుకు ఉరేసుకున్న మిత్రుడు మునిరత్నం

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో విషాదాకరమైన సంఘటన చోటు చేసుకుంది. వారం రోజుల క్రితం అదృశ్యమైన యువతి పావని బావిలో శవమై తేలింది. ఆమె మిత్రుడు చెట్టుకు ఉరేసుకున్నాడు.

చిత్తూరు: వారం రోజుల క్రితం అదృశ్యమైన యువతి పావని సంఘటన విషాదాంతమైంది. ఓ వ్యవసాయ బావిలో ఆమె శవమై కనిపించింది. మంగళవారం బావిలో ఆమె మృతదేహాన్ని కనిపెట్టారు. 

చిత్తూరు జిల్లా రామకుప్పం మండంల మునింద్రంకు చెందిన పావని వారం రోజుల క్రితం కనిపించకుండా పోయింది. చివరకు బావిలో శవమై తేలింది. పాపని మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

మిత్రుడు మునిరత్నమే పావనిని హత్య చేశాడని ఆరోపిస్తూ ఆమె కుటుంబ సభ్యులు ఇంటిపై దాడి చేశారు. అయితే, వారు దాడి చేసిన సమయంలో అతను పరారీలో ఉన్నాడు. చివరకు మునిరత్నం ముణేంద్రం ఇంటికి సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని మరణించాడు. 

PREV
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu