రాత్రికి రాత్రి సొరంగం: నూజివీడులో గుప్తనిధుల కలకలం

Siva Kodati |  
Published : Dec 22, 2020, 09:27 PM IST
రాత్రికి రాత్రి సొరంగం: నూజివీడులో గుప్తనిధుల కలకలం

సారాంశం

కృష్ణా జిల్లాలో గుప్త నిధుల వ్యవహారం కలకలం రేపింది. ముసునూరు మండలం గొల్లపూడి శివారు గుడిపాడు గ్రామంలో గ్రామంలో వెల్నెస్ సెంటర్ నిర్మాణం కోసం తవ్విన పునాది గుంటలో పురాతనమైన ఒక మట్టి కుండ బయటపడింది.

కృష్ణా జిల్లాలో గుప్త నిధుల వ్యవహారం కలకలం రేపింది. ముసునూరు మండలం గొల్లపూడి శివారు గుడిపాడు గ్రామంలో గ్రామంలో వెల్నెస్ సెంటర్ నిర్మాణం కోసం తవ్విన పునాది గుంటలో పురాతనమైన ఒక మట్టి కుండ బయటపడింది.

ఈ మట్టికుండను గుర్తించిన గుప్తనిధుల తవ్వకాలకు పాల్పడే ఓ ముఠా రాత్రికి రాత్రి ఈ ప్రాంతంలో సొరంగం మాదిరిగా తవ్వకాలు కొనసాగించింది. ఈ క్రమంలో అనేక విలువైన వస్తువులను దోచుకువెళ్లినట్టు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. 

దీనిపై గ్రామ పెద్దలు ఫిర్యాదు చేయడంతో ముసునూరు తహసీల్దార్, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా పురాతనమైన కుండ, గుప్తనిధుల కోసం తవ్వకాలు సాగించిన సొరంగం వంటి మార్గాన్ని అధికారులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ సొరంగాన్ని పరిశీలించిన పోలీసులు.. ఆర్కియాలజీ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో విజయవాడ నుంచి ప్రత్యేక బృందం గొల్లపూడి బయల్దేరింది. పురాతత్వ శాఖ అధికారులు సొరంగాన్ని పరిశీలిస్తే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది

PREV
click me!

Recommended Stories

Republic Day Celebrations 2026: గణతంత్ర వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ స్పీచ్ | Asianet Telugu
Republic Day Celebrations in Amaravati: చంద్రబాబుకి పవన్ కి లోకేష్ ఘన స్వాగతం| Asianet News Telugu