మచిలీపట్నంలో షాకింగ్ ఘటన: తల్లితో సహజీవనం.. ఆమె కూతురిపై అఘాయిత్యం..

Published : Apr 30, 2022, 10:58 AM IST
మచిలీపట్నంలో షాకింగ్ ఘటన: తల్లితో సహజీవనం.. ఆమె కూతురిపై అఘాయిత్యం..

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లోని  మచిలీపట్నంలో దారుణం  చోటుచేసుకుంది. మహిళతో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి.. ఆమె కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను బెదిరించి పదినెలల పాటుగా ఈ ఘాతుకానికి పాల్పడుతూ వచ్చాడు. 

ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో దారుణం  చోటుచేసుకుంది.మహిళతో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి.. ఆమె కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను బెదిరించి పదినెలల పాటుగా ఈ ఘాతుకానికి పాల్పడుతూ వచ్చాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కోమటి సురేష్ అనే వ్యక్తి బాధిత బాలిక తల్లితో సహజీవనం చేస్తున్నాడు. తండ్రి స్థానంలో ఉన్న అతడు బాలికతో మృగంలా ప్రవర్తించాడు. బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే బాలిక గర్భం దాల్చింది.

గర్భంతో ఉన్న బాలికను బంధువులు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే నిన్న బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు కోమటి‌ సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.  నిందితుడు డ్రైవర్‌గా పనిచేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా  తీవ్ర కలకలం రేపింది. కాగా, ఇందుక సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రూ. 15వేల కోట్ల పెట్టుబ‌డి, 45 వేల‌కిపై ఉద్యోగాలు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో దిగ్గజ సంస్థ
Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet Telugu