మచిలీపట్నంలో షాకింగ్ ఘటన: తల్లితో సహజీవనం.. ఆమె కూతురిపై అఘాయిత్యం..

Published : Apr 30, 2022, 10:58 AM IST
మచిలీపట్నంలో షాకింగ్ ఘటన: తల్లితో సహజీవనం.. ఆమె కూతురిపై అఘాయిత్యం..

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లోని  మచిలీపట్నంలో దారుణం  చోటుచేసుకుంది. మహిళతో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి.. ఆమె కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను బెదిరించి పదినెలల పాటుగా ఈ ఘాతుకానికి పాల్పడుతూ వచ్చాడు. 

ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో దారుణం  చోటుచేసుకుంది.మహిళతో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి.. ఆమె కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను బెదిరించి పదినెలల పాటుగా ఈ ఘాతుకానికి పాల్పడుతూ వచ్చాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కోమటి సురేష్ అనే వ్యక్తి బాధిత బాలిక తల్లితో సహజీవనం చేస్తున్నాడు. తండ్రి స్థానంలో ఉన్న అతడు బాలికతో మృగంలా ప్రవర్తించాడు. బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే బాలిక గర్భం దాల్చింది.

గర్భంతో ఉన్న బాలికను బంధువులు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే నిన్న బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు కోమటి‌ సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.  నిందితుడు డ్రైవర్‌గా పనిచేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా  తీవ్ర కలకలం రేపింది. కాగా, ఇందుక సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియా పరిశ్రమకు శంకుస్థాపన చేసిన సీఎం | Asianet
CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియాచంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu