‘ఉప ఎన్నికలు వచ్చే అవకాశమే లేదు’

Published : May 29, 2018, 10:11 AM IST
‘ఉప ఎన్నికలు వచ్చే అవకాశమే లేదు’

సారాంశం

ఏపీ మంత్రి యనమల

రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేనేలేదని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. వైసీపీ ఎంపీలు తమ రాజీనామాలను సమర్పించిన సంగతి తెలిసిందే. కాగా.. స్పీకర్ సుమిత్రా మహాజన్.. ఆ రాజీనామాలను ఇప్పటివరకు ఆమోదించలేదు. త్వరలోనే ఆమోదించే అవకాశం ఉందని సమాచారం.

కాగా.. వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించినా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగతంగా వెళ్లి రాజీనామాలు ఇస్తే ఆరోజే ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు. రాజీనామాలు ఆమోదించినా నోటిఫై చేయడానికి సమయం ఉంటుందని పేర్కొన్నారు. రాజీనామాలపై పథకం ప్రకారమే వైసీపీ ఎంపీలను పిలిచారని...వైసీపీ, బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని మంత్రి యనమల మండిపడ్డారు.
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే