సభలో తలదించుకుంటా... మంత్రి బొత్స సత్యనారాయణ

Published : Jun 17, 2019, 03:35 PM IST
సభలో తలదించుకుంటా... మంత్రి బొత్స సత్యనారాయణ

సారాంశం

ప్రతిపక్ష పార్టీ నేతలకు... మంత్రి బొత్స సత్యనారాయణ సవాలు విసిరారు. ప్రత్యేక హోదా కోసం ఏపీ మాజీ సీఎం పోరాడారని నిరూపిస్తే.. తాను సభలో తలదించుకుంటానని ఆయన అన్నారు.  

ప్రతిపక్ష పార్టీ నేతలకు... మంత్రి బొత్స సత్యనారాయణ సవాలు విసిరారు. ప్రత్యేక హోదా కోసం ఏపీ మాజీ సీఎం పోరాడారని నిరూపిస్తే.. తాను సభలో తలదించుకుంటానని ఆయన అన్నారు.

సోమవారం ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా విషయమై అధికార ప్రతిపక్ష నేతలకు శాసనమండలలిలో చర్చ జరిగింది.  ఈ చర్చలో హోదా కోసం ప్రతిపక్షనేత చంద్రబాబు పోరాడుతున్నారంటూ టీడీపీ సభ్యుడు రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై మంత్రులు అవంతి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

ప్రత్యేక హోదా కోసం నీతి ఆయోగ్‌ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడినట్లు చంద్రబాబు నాయుడు ఏనాడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.  హోదాపై టీడీపీ సభ్యులు అలా మాట్లాడినట్లు చూపిస్తే.. సభలో తలవంచుకుని నిలబడతానంటూ మంత్రి బొత్స  సత్యనారాయణ సవాల్‌ చేశారు.

హోదా వద్దని ప్యాకేజీని ఎందుకు తీసుకువచ్చారని మంత్రి ఘాటుగా ప్రశ్నించారు. హోదా సంజీవని కాదంటూ చంద్రబాబు అవహేళన చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది టీడీపీ కాదా అని ప్రశ్నించారు. హోదా గురించి మాట్లాడే హక్కు టీడీపీ సభ్యులకు లేదని తీవ్రంగా హెచ్చరించారు. కేంద్రంతో కొట్లాడైనా సరే ఏపీకి ప్రత్యేక హోదాను తెచ్చి తీరుతామని మంత్రి బొత్స మండలిలో స్పష్టం చేశారు.  

PREV
click me!

Recommended Stories

Weather Alert : చలి ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తోంది .. ఈ తెలుగు జిల్లాల ప్రజలు మళ్లీ గజగజా వణకాల్సిందేనా?
మోదీకి గాడ్సే కి తేడా ఉందా? YS Sharmila Comments | AP Congress | Asianet News Telugu