వివాహేతర సంబంధం : భార్య కాపురానికి రాలేదని విషద్రావణం తాగిన భర్త.. ట్విస్ట్ ఏంటంటే...

By SumaBala BukkaFirst Published Dec 30, 2021, 2:10 PM IST
Highlights

ప్రతాప్ మరో మహిళతో Extramarital affair కలిగి ఉన్నాడనే కారణంతో  భార్య  మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది.  అతను  వారి ఇంటి వద్దకు వెళ్లి గొడవ చేస్తుండడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.  దీంతో వన్టౌన్ పోలీసులు అతని స్టేషన్కు తీసుకెళ్లారు.

ప్రొద్దుటూరు :  భార్య కాపురానికి రాలేదని కారణంతో గురు ప్రతాప్ అనే యువకుడు విష ద్రావణం తాగి suicide attemptకు ప్రయత్నించాడు. ప్రొద్దుటూరు లోని ఆర్ట్స్ కాలేజి రోడ్డు కు చెందిన సుంకేసుల గురు ప్రతాప్ బుధవారం సాయంత్రం వన్టౌన్ పోలీస్స్టేషన్ ఆవరణలో Toxic solution తాగాడు.  పోలీసులు వెంటనే అతన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు ఈ పోస్ట్ పోలీసులు తెలిపిన మేరకు  గురు ప్రతాప్.. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

 అతనికి  పట్టణంలోని గీత ఆశ్రమం వీధికి చెందిన  అనూష తో ఏడేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.  కాగా ప్రతాప్ మరో మహిళతో Extramarital affair కలిగి ఉన్నాడనే కారణంతో  భార్య  మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది.  అతను  వారి ఇంటి వద్దకు వెళ్లి గొడవ చేస్తుండడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.  దీంతో వన్టౌన్ పోలీసులు అతని స్టేషన్కు తీసుకెళ్లారు.

ఈ క్రమంలో అతను తన  వెంట తెచ్చుకున్న  విష ద్రావణం  తాగుతుండగా పోలీసులు గమనించి  సీసాను లాక్కున్నారు. వెంటనే ప్రతాప్ ను ఆస్పత్రికి తీసుకెళ్లారు.  చికిత్స చేస్తున్న వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు పోలీసులు కుటుంబ సభ్యుల నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు.

15ఏళ్ల పైబడిన యువతీ యువకులకూ కరోనా వ్యాక్సిన్... ఏపీ ప్రభుత్వ మార్గదర్శకాలివే...

ఇదిలా ఉండగా, తెలంగాణలోని Shamirpet మండల  కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థిని (15)  తొమ్మిదో తరగతి విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడు లైంగిక దాడి చేశాడు. వివరాల్లోకి వెడితే.. ఆ విద్యార్థిని రోజూలాగే ఈ నెల 22న యధావిధిగా schoolకి వెళ్ళింది. mask పెట్టుకోలేదనే కారణంతో తన గదిలోకి రావాల్సిందిగా విద్యార్థిని Headmaster ఆదేశించాడు.

ఏమంటాడో, ఏం పనిష్మెంట్ ఇస్తాడో నని భయం భయంగా వెళ్లిన విద్యార్థిని మీద ఆ కీచక ప్రధానోపాధ్యాయుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తరువాత ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. దీంతో బాలిక బాగా భయపడి తల్లితో సహా ఎవరికీ ఈ విషయాన్ని చెప్పలేదు.

అదే పాఠశాలలో గతంలో పనిచేసిన ప్రధానోపాధ్యాయురాలు బుధవారం అనుకోకుండా కలిసింది. ఆమె విద్యార్థిని కాస్త డల్ గా ఉండడం చూసింది. విద్యార్థిని కూడా ఆ ప్రధానోపాధ్యాయురాలితో ఉన్న చనువు కారణంగా.. బాలిక జరిగిన దారుణాన్ని ఆమె చెప్పింది. అది విన్న ఆమె ముందుగా షాక్ అయ్యింది. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ప్రధానోపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలని చెప్పింది. 

తల్లికి విషయం చెప్పి, ధైర్యం చెప్పడంతో బాలిక, ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించారు. అయితే విషయం బయటికి పొక్కడంతో.. ఓ పార్టీ నేతలు ప్రధానోపాధ్యాయుడికి మద్దతుగా రంగంలోకి దిగారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిహారం ఇప్పిస్తామంటూ రాజీకి ప్రయత్నించారు.

ఈ సమాచారం తెలుసుకున్న మరో పార్టీ నాయకులు బాధిత బాలికకు మద్దతుగా నిలిచారు. దీంతో బాధితురాలి తల్లి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ సుధీర్కుమార్ పేర్కొన్నారు. 

click me!