‘అమరావతి’ కి ‘మహానటి’ రూ.50లక్షల విరాళం

Published : May 26, 2018, 02:00 PM IST
‘అమరావతి’ కి ‘మహానటి’ రూ.50లక్షల విరాళం

సారాంశం

మహానటి టీంని సన్మానించిన చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం ‘మహానటి’ చిత్ర యూనిట్ ను సన్మానించారు. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ‘మహానటి’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అఖండ
విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చంద్రబాబు చిత్ర యూనిట్ ను అభినందించారు. 

తన మంత్రివర్గానికి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా మహానటి సినిమా చూడాల్సిందిగా ప్రమోట్ చేసినట్లు చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం చిత్ర నిర్మాతలు వైజయంతి సంస్థ తరఫున
 రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ. 50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. 

ఈ సందర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ ఈ సినిమా సూపర్ హిట్టయినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. మరీ ముఖ్యంగా సావిత్ర పాత్ర పోషించడం గొప్పతనమని, ఈ పాత్రతో  తనకు మంచి గుర్తింపు ఇచ్చిన చిత్ర యూనిట్‌కు, అభిమానులకు కీర్తి సురేష్ అభినందనలు తెలిపారు. మహానటి సావిత్రి పుట్టన ఊరు గుంటూరని, ఇక్కడ ఈ కార్యక్రమం జరగడం గొప్పతనమని  చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ కార్యక్రమానికి మంత్రులు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేష్‌, చిత్ర నిర్మాతలు, డైరెక్టర్‌తో పాటు పలువురు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.

PREV
click me!

Recommended Stories

Chandrababu Power Full Speech: అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం| Asianet News Telugu
Kandula Durgesh Super Speech: Amarajeevi Jaladhara Scheme Foundation Ceremony | Asianet News Telugu