పవన్ కళ్యాణ్‌తో వల్లభనేని బాలశౌరి భేటీ .. సీటుపై స్పష్టమైన హామీ, త్వరలోనే జనసేనలోకి ..?

Siva Kodati |  
Published : Jan 19, 2024, 07:12 PM ISTUpdated : Jan 19, 2024, 07:23 PM IST
పవన్ కళ్యాణ్‌తో వల్లభనేని బాలశౌరి భేటీ .. సీటుపై స్పష్టమైన హామీ, త్వరలోనే జనసేనలోకి ..?

సారాంశం

 జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరీ కలిశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మచిలీపట్నం లేదా గుంటూరు సీటు తనకు కేటాయించాలని బాలశౌరీ కోరినట్లుగా తెలుస్తోంది. 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరీ కలిశారు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఆయన జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం హైదరాబాద్‌లో పవన్‌తో భేటీ అయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మచిలీపట్నం లేదా గుంటూరు సీటు తనకు కేటాయించాలని బాలశౌరీ కోరినట్లుగా తెలుస్తోంది. దీనికి పవన్ స్పందిస్తూ ఖచ్చితంగా సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. పవన్ నుంచి స్పష్టమైన హామీ రావడంతో త్వరలోనే బాలశౌరీ జనసేన తీర్ధం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుత బందర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నానితో బాలశౌరికి గత కొంతకాలంగా విభేదాలున్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించడంపై అధిష్టానం నుంచి ఎలాంటి హామీ లభించకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీనికి తోడు తన కొడుకు అసెంబ్లీ టికెట్ పైనా క్లారిటీ ఇవ్వకపోవడంతో వైసీపీనీ వీడాలని బాలశౌరి నిర్ణయించుకున్నారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే