అనుమానాస్పద మృతి: ప్రేమిస్తున్నానని వెంటపడిందంటున్న లెక్చెరర్

By telugu teamFirst Published Apr 16, 2019, 1:03 PM IST
Highlights

ప్రేమిస్తున్నానంటూ జ్యోత్స్న తన వెంటపడిందని లెక్చరర్ కిష్లే చెబుతున్నాడు. విశాఖ కెజిహెచ్ ఆస్పత్రి మార్చురీ వద్ద విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. 

విశాఖపట్నం: విశాఖపట్నం అక్కయ్యపాలెంలోని లెక్చెరర్ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన బిటెక్ విద్యార్థిని జ్యోత్స్న కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. జ్యోత్స్న తల్లిదండ్రులు లెక్చెరర్ అంకూర్ కిష్లేపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురిని ఆయన చంపాడని వారు ఆరోపిస్తున్నారు. 

లెక్చెరర్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. అయితే, ప్రేమిస్తున్నానంటూ జ్యోత్స్న తన వెంటపడిందని లెక్చరర్ కిష్లే చెబుతున్నాడు. విశాఖ కెజిహెచ్ ఆస్పత్రి మార్చురీ వద్ద విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. 

విద్యార్థిని మృతి విశాఖపట్నంలో తీవ్ర కలకలం రేపుతోంది. వాస్తవాలు వెలికి తీయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

సంబంధిత వార్త

click me!