రావులపాలెంలో అర్థరాత్రి కాల్పుల కలకలం

Published : Sep 05, 2022, 06:33 AM IST
రావులపాలెంలో అర్థరాత్రి కాల్పుల కలకలం

సారాంశం

ఆంధ్రప్రదేశ్ లోని రావులపాలెంలో ఆదివారం గుర్తు తెలియని దుండగులు ఓ వ్యాపారి, ఆయన కుమారుడిపై కాల్పులకు తెగబడ్డాడు. వారి అరుపులకు చుట్టుపక్కలవారు రావడంతో పారిపోయారు. 

కోనసీమ : రావులపాలెంలో ఆదివారం అర్ధరాత్రి కాల్పుల కలకలం చోటుచేసుకుంది.  ఫైనాన్స్ వ్యాపారి సత్యనారాయణ రెడ్డిపై ఇద్దరు దుండగులు దాడి చేశారు. ఈ క్రమంలో ఆయన కుమారుడు ఆదిత్య రెడ్డి దుండగులను ప్రతిఘటించారు. దీంతో దుండగులు గాల్లోకి కాల్పులు జరిపారు. బాధితులు కేకలు వేయడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు.  దుండగులు పారిపోతుండగా వారి వద్ద నుంచి ఓ సంచీ పడిపోయింది. దానిని పరిశీలించగా అందులో రెండు నాటుబాంబులు, జామర్ ఉన్నాయి.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?