సాంబారులో పడి 3 ఏళ్ల చిన్నారికి గాయాలు

Published : Nov 25, 2019, 06:17 PM ISTUpdated : Nov 25, 2019, 06:26 PM IST
సాంబారులో పడి 3 ఏళ్ల చిన్నారికి గాయాలు

సారాంశం

సాంబారులో పడి మూడేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో చోటు చేసుకొంది.

ర్నూల్ : కర్నూల్ జిల్లా నందికొట్యూరు తాలుకా మిడుతూరు మండలం కోడూరు గ్రామంలో  అంగన్ వాడీ  కేంద్రంలో వేడి సాంబారు గిన్నెలో పడి  మూడేళ్ల మధుప్రియ అనే చిన్నారి తీవ్రంగా గాయపడింది.

పాణ్యం మండలంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో సాంబార్‌లో ఓ విద్యార్ధి మృతి చెందాడు. ఈ ఘటన మరువకముందే  సోమవారం నాడు నందికొట్కూరు మండలం మిడుతూరు మండలం కోడూరు అంగన్‌వాడీ కేంద్రంలో సాంబారులో పడి  మధుప్రియ గాయాలపాలైంది. 

మధుప్రియను చిన్నారి కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీచర్‌పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

dhulipalla narendra ఘనంగా ధూళిపాళ్ల కుమార్తె వివాహం హాజరైన తెలుగు రాష్ట్రాల సీఎం లు | Asianet Telugu
కుప్పంలో మెగా జాబ్ మేళాలో పాల్గొన్న నారా భువనేశ్వరి| Asianet News Telugu