నంద్యాల జిల్లాలో దారుణం.. నాల్గో తరగతి బాలిక కిడ్నాప్ యత్నం.. మత్తుమందిచ్చి, తాళ్లతో కట్టి...

Published : Jul 14, 2023, 01:21 PM IST
నంద్యాల జిల్లాలో దారుణం.. నాల్గో తరగతి బాలిక కిడ్నాప్ యత్నం.. మత్తుమందిచ్చి, తాళ్లతో కట్టి...

సారాంశం

నంద్యాల జిల్లాలో నాల్గో తరగతి బాలికను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు గుర్తు తెలియని దుండగులు. మత్తుమందిచ్చి, చేతులు కట్టేసి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు.  

నంద్యాల : ఏపీలోని నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం ఎర్రగుంటలో దారుణం ఘటన వెలుగు చూసింది. ఓ నాలుగో తరగతి విద్యార్థినిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. కొందరు దుండగులు. బాలిక స్కూల్ నుంచి వచ్చి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో కిడ్నాప్ కు ప్రయత్నించారు. ఇద్దరు వ్యక్తులు మాస్క్ వేసుకుని వచ్చి.. బాలికకు మత్తుమందు ఇచ్చారు. ఆ తరువాత చేతులు కట్టేసి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

కాగా బాలికకు వెంటనే స్పృహరావడంతో గట్టిగా కేకలు వేసింది. దీంతో కంగారు పడ్డ దుండగులు.. బాలిక మెడకు తాడు బిగించి.. అక్కడే వదిలేసి పారిపోయారు. బాలిక కేకలు విన్న స్థానికులు వెతుక్కుంటూ రాగా.. గొంతుకు తాడు బిగించి, చేతులు కట్టేసి బాలిక కనిపించింది. వెంటనే బాలిక గొంతుకు కట్టిన తాడును తీశాడు. తాడు వల్ల బాలిక గొంతుకు గాయమయ్యింది. ఇంకో అరగంట పాటు బాలిక అలాగే ఉంటే చనిపోయేదని తల్లిదండ్రులు అంటున్నారు. 

ఏలూరు మారుటి తండ్రి కేసు : యూట్యూబ్లో చూసి డెలివరీలు చేసిన తల్లి.. మరోసారి గర్భం దాల్చిన కూతుర్లు...!!

ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు పనులకు వెళ్లారు. బాలిక స్కూల్ నుంచి వచ్చి ఇంట్లో ఉంది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. బాలికనే ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!