కెఇ ప్రభాకర్ ఏకగ్రీవం

Published : Dec 29, 2017, 03:39 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
కెఇ ప్రభాకర్ ఏకగ్రీవం

సారాంశం

టిడిపి ఖాతాలో మరో ఎంఎల్సీ స్ధానం చేరింది.

టిడిపి ఖాతాలో మరో ఎంఎల్సీ స్ధానం చేరింది. కర్నూలు స్థానిక సంస్థల ఉప ఎన్నికలో పోటీ లేకుండానే కెఇ ప్రభాకర్ గెలిచారు. స్వతంత్ర అభ్యర్ధులు తమ నామినేఫషన్లను ఉపసంహరించుకోవటంతో టిడిపి తరుపున బరిలోకి దిగిన కెఈ ప్రభాకర్ ఏకగ్రీవమయ్యారు. ఈ ఎన్నికలో పోటీ నుండి వైసిపి తప్పుకోవటం అందరికీ తెలిసిందే. శిల్పా చక్రపాణి రెడ్డి తెలుగుదేశం పార్టీతో పాటు తన ఎమ్మెల్సీగా రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక వచ్చింది. అయితే, టిడిపి మాజీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మద్దతుదారుడు నాగిరెడ్డి నామినేషన్ ఉపసంహరణపై ఎటూ తేల్చకపోవటంతో గురువారం సాయంత్రం వరకూ ఉత్కంఠ సాగింది. అయితే, బైరెడ్డి గురువారం రాత్రి చంద్రబాబునాయుడును కలిసారు. శుక్రవారం ఉదయం నాగిరెడ్డి తన నామినేషన్ను ఉపసంహరించుకోవటంతో ప్రభాకర్ గెలుపు ఏకగ్రీవమని తేలిపోయింది.  

 

PREV
click me!

Recommended Stories

Andhra Pradesh Legislative Council: తిరుమల నెయ్యి కల్తీ పైఅసెంబ్లీ లో రచ్చ రచ్చ | Asianet Telugu
CM Chandrababu Speech: ఏపీ ప్రాజెక్టులపై అసెంబ్లీలో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu