ఇక నుంచి రాష్ట్ర వ్యాపిత కాపు ఉద్యమమే : ముద్రగడ

Published : Feb 27, 2017, 03:18 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
ఇక నుంచి రాష్ట్ర వ్యాపిత కాపు ఉద్యమమే : ముద్రగడ

సారాంశం

ఎప్రిల్ లో 13 జిల్లాల కాపు నాయకుల సమావేశం, ఆ తర్వాత కాపు  రిజర్వేషన్   ఉద్యమం ఉధృతం, విస్తృతం

 కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని తూర్పు గోదావరి ఎల్లలు దాటించి రాష్ట్ర వ్యాపితం చేసేందుకు ముద్ర గడ పద్మనాభం చేసిన తొలిప్రయత్నం ఫలించింది. ఆయన కర్నూల్ పట్టణానికి వచ్చారు.  ఆదివారం కర్నూలు లోని మెగాసిరి ఫంక్షన్‌ హాలులో కాపు, తెలగ, బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒక రోజు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు (పక్క ఫోటో).

 

ఇక ఉద్యమాన్ని మరింత ఉధృతం విస్తృతం చేసేందుకు కృషి ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఇందులో భాగంగా  ఏప్రిల్‌లో 13 జిల్లాల నాయకులతో  కాపు పోరాట సమావేశం ఏర్పాటు చేస్తామని, తర్వాత ఉద్యమ ప్రణాళికను రూపొందిస్తామని కాపు రిజర్వేషన్ పోరాట నాయకుడు  తెలిపారు. కాపులను బీసీల్లోకి మార్చే వరకు దీక్షలు ఆగవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాపులు రోడ్డెక్కేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ప్రధాన కారణమని  ఆరోపించారు.

కాపులకు బిసి  హోదా కల్పించే డిమాండ్ గురించి మాట్లాడుతూ,  2014 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేపట్టినప్పుడల్లా  చంద్రబాబు నాయుడు కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చిన సంగతి గుర్తు చేశారు. అయితే,  అధికారంలోకి రాగానే మరిచిపోయారని, ఆ విషయం ఆయనకు గుర్తు చేసేందుకే  ఈ ఉద్యమం తప్ప మరొక లక్ష్యంతో సాగడం లేదని ఆయన స్పష్ట పరిచారు.

 

ఈ ఉద్యమాని ప్రజల మద్దతు తప్ప ఎవరి నుంచి ఎలాంటి సహాయ పొందడం లేదని అంటూ వైఎస్‌ జగన్‌ నుంచి తాము ఎలాంటి సాయం పొందలేదని, చంద్రబాబే జగన్‌ తండ్రి నుంచి సాయం పొందారని ముద్రగదడ అన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు బావమరది బాలకృష్ణ కాల్పుల కేసులో ఇరుక్కున్నపుడు నెంబరు లేని కారులో వైఎస్‌ వద్దకు వెళ్లి కేసు లేకుండా చేసుకున్నారని ఆయన చెబుతూ కాపు ఉద్యమకారులు ఇలాంటి సహాయం కోరరని అన్నారు.

 

 

కాపు  ఉద్యమ  కార్యకర్తలు ఎక్కడ సమావేశమయిన ,కలసి భోజనాలు చేసినా, సమావేశాలు పెట్టినా,  ఫ్లెక్సీలు కట్టినా ప్రభుత్వం బెదిరించడం ఎమిటని ఆయన ప్రశ్నించారు.

 

 ‘2016 ఫిబ్రవరిలో మేం  ఆందోళన చేసినపుడు ఎమి హామీ ఇచ్చారు.  ఆగస్టులోపు కాపులను బీసీల్లో చేర్చుతామని అన్నారు. తర్వాత కమి టి నివేదిక రావాలి అన్నారు. ఇపుడు 2017 ఫిబ్రవరి. కమిటీ నివేదిక రాదు,  మీ హామీ నెరవేర్చరు.  ఆగస్టులో కమిటీ పెట్టి కాలయాపన చేస్తున్నారు. ఇంతకంటే మోసం ఎముంటుంది. దీనిని ప్రశ్నించరాదంటారా?’ అని ముద్రగడ అడిగారు.


ఇది ఇలా ఉంటే, ముద్రగడ కర్నూలు దీక్షకు మద్దతుగా-


తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఆదివారం నాడు సత్యాగ్రహాలు జరిపారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సత్యాగ్ర హాలు ప్రశాంతగా సాగాయి.  ముద్రగడ లేకపోవడంతో, పోలీసుల కూడ అనుమతి లేదనే సాకుత్ వాటిని ఎత్తివేసే ప్రయత్నం చేయలేదు.

 

కాపు జెఎసి నేతలు వాసిరెడ్డి ఏసుదాసు కాకినాడలో, కల్వకుంట తాతాజీ కోనసీమలో, గొల్లపల్లి కాశీ విశ్వనాధం ప్రత్తిపాడులో, తూము చినబాబు కిర్లంపూడిలో జరిగిన సత్యాగ్రహాలలో పాల్గొన్నారు.

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?