ఏపీకి మూడు రాజధానులు: రేపు కన్నా లక్ష్మీనారాయణ మౌనదీక్ష

Published : Dec 26, 2019, 03:38 PM IST
ఏపీకి మూడు రాజధానులు: రేపు కన్నా లక్ష్మీనారాయణ మౌనదీక్ష

సారాంశం

ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనను నిరసిస్తూ బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం నాడు మౌన దీక్షకు దిగనున్నారు. 


అమరావతి: ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనను నిరసిస్తూ బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ  ఈ నెల 27న మౌన దీక్ష చేయనున్నారు. బీజేపీ శ్రేణులతో పాటు కలిసి కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్ష చేస్తారు.

ఏపీ రాష్ట్రానికి చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో అమరావతిలోని ఉద్దండరాయునిపాలెంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ శంకుస్థాపన చేశారు. ప్రధాన మంత్రి శంకుస్థాపన చేసిన ప్రాంతంలోనే శుక్రవారం నాడు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్ష చేయనున్నారు. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనను బీజేపీ వ్యతిరేకిస్తోంది.

ఈ ప్రతిపాదనను బీజేపీ నిరసిస్తోంది. ఏపీ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ నెల 27వ తేదీన జరగనుంది. జీఎన్ రావు కమిటీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ కేబినెట్ సమావేశంలో జీఎన్ రావు కమిటీతో పాటు  కేబినెట్ అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

 

PREV
click me!

Recommended Stories

Nara Lokesh: కోట్లు విలువైన ఇంజెక్షన్ ఇచ్చి చిన్నారి ప్రాణాలు కాపాడిన మంత్రి లోకేష్| Asianet Telugu
CM Chandrababu Naidu Rally మహిళా బిల్లును అడ్డుకోవడం మహిళలకు ద్రోహం సీఎం ర్యాలీ| Asianet News Telugu