పట్టభద్రుల ఎమ్మెల్సీగా కేఎస్ లక్ష్మణరావు ఘన విజయం

Published : Mar 28, 2019, 07:01 AM IST
పట్టభద్రుల  ఎమ్మెల్సీగా కేఎస్ లక్ష్మణరావు ఘన విజయం

సారాంశం

68,120 ఓట్ల మెజారిటీతో లక్ష్మణరావు సమీప ప్రత్యర్థి నూతపాటి అంజయ్యపై గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మెుత్తం 1,49,319 ఓట్లు పోలవ్వగా లక్ష్మణరావుకు 80,670 పోలయ్యాయి. లక్ష్మణరావు గతంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా రెండు సార్లు ఎన్నికయ్యారు. 

అమరావతి: కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్‌ అభ్యర్థి కె.ఎస్‌.లక్ష్మణరావు ఘన విజయం సాధించారు. 68,120 ఓట్ల మెజారిటీతో లక్ష్మణరావు సమీప ప్రత్యర్థి నూతపాటి అంజయ్యపై గెలుపొందారు. 

ఈ ఎన్నికల్లో మెుత్తం 1,49,319 ఓట్లు పోలవ్వగా లక్ష్మణరావుకు 80,670 పోలయ్యాయి. లక్ష్మణరావు గతంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా రెండు సార్లు ఎన్నికయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్త శుద్దితో కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. లక్ష్మణరావు భారీ ఆధిక్యంతో గెలుపొందడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు.   
 

PREV
click me!

Recommended Stories

Supreme Court Chief Justice Surya Kant: అమరావతిలో జస్టిస్ సిటీ: సీజేఐ సూర్యకాంత్ | Asianet Telugu
AP Food Commission Chairman: ఈ చిన్నారి మాటలకి ఫుడ్ కమీషన్ చైర్మన్ ఫిదా| Asianet News Telugu