ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ప్రమాణం చేసిన జస్టిస్ ప్రవీణ్ కుమార్

sivanagaprasad kodati |  
Published : Jan 01, 2019, 10:44 AM IST
ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ప్రమాణం చేసిన జస్టిస్ ప్రవీణ్ కుమార్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్.. ప్రవీణ్ కుమార్ చేత ప్రమాణం చేయించారు. 

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్.. ప్రవీణ్ కుమార్ చేత ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయడుతో పాటు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. నిన్నటి వరకు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడిగా సేవలందించిన హైకోర్టును విభజిస్తూ కేంద్రప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

దీంతో జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టులు సేవలందిస్తాయి. అమరావతిలోని హైకోర్టు భవనం పూర్తయ్యేవరకు విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో తాత్కాలిక హైకోర్టు భవనాన్ని ఏర్పాటు చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్