కర్నూల్ జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో నాగరాజు అనే రైతుకు వజ్రం దొరికింది. ఈ ప్రాంతంలో తరచుగా వజ్రాలు లభ్యమౌతాయి. వజ్రాల కోసం ఇతర రాష్ట్రాల నుండి కూడ వచ్చి అన్వేషిస్తారు. నాగరాజుకు దొరికిన వజ్రాన్ని ఓ వ్యాపారి రూ. 3 లక్షలు చెల్లించాడు. ఒక్క నెలలో ఈ ప్రాంతంలో సుమారు రూ. 5 కోట్ల విలువైన వజ్రాలు దొరికాయి.
కర్నూల్: కర్నూల్ జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో నాగరాజు అనే రైతుకు వజ్రం లభించింది. ఈ వజ్రాన్ని వ్యాపారికి నాగరాజు విక్రయించాడు. నాగరాజుకు వ్యాపారి రూ. 3 లక్షలు ఇచ్చాడు. అయితే ఈ వజ్రం విలువ బహిరంగ మార్కెట్ లో రూ. 12 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.నెల రోజుల్లో జొన్నగిరిలో సుమారు 5 కోట్ల విలువైన వజ్రాలు లభ్యమయ్యాయి. ఈ ప్రాంతంలో ప్రతి ఏటా వర్షాకాలం ఆరంభంలో పంటలు వేసే సమయంలో వజ్రాల కోసం స్థానికులు వెతుకుతారు.
నాగరాజు అనే రైతు తన పొలంలో విత్తనాలు వేస్తున్న సమయంలో వజ్రం దొరికింది. ఈ వజ్రాన్ని అతను వెంటనే తనకు తెలిసిన వ్యాపారికి విక్రయించాడు. వ్యాపారి నాగరాజుకు రూ. 3 లక్షలు ఇచ్చాడు.అయితే బహిరంగ మార్కెట్ లో దీని విలువ రూ. 12 లక్షలు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.జొన్నగిరి, తుగ్గలి తదితర ప్రాంతాల్లో తరచుగా వజ్రాలు లభ్యమౌతున్నాయి. వజ్రాల కోసం స్థానికులతో పాటు కర్ణాటక, అనంతపురం జిల్లాల నుండి కూడ వచ్చి వెతుకుతారు. ఈ ప్రాంతంలో వజ్రాల కోసం ప్రైవేట్ సంస్థలు కూడ సర్వే నిర్వహిస్తున్నాయి.