పోలీసుల ముందు జేసీ దివాకర్ రెడ్డి సరెండర్: గంటల కొద్దీ స్టేషన్ లోనే...

Published : Jan 04, 2020, 04:37 PM IST
పోలీసుల ముందు జేసీ దివాకర్ రెడ్డి సరెండర్: గంటల కొద్దీ స్టేషన్ లోనే...

సారాంశం

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో సరెండరయ్యారు. ఆయనను దాదాపు ఐదు గంటల పాటు పోలీసులు స్టేషన్ లోనే ఉంచారు.

అనంతపురం: తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి శనివారంనాడు అనంతపురం రూరల్ పోలీసు స్టేషన్ లో లొంగిపోయారు. పోలీసులపై ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై కేసు నమోదైంది. 

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులతో బూట్లు నాకిస్తామని, గంజాయి కేసులు పెడుతామని ఆయన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలోనే అన్నారు. దాంతో జేసీపై అనంతపురం జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు త్రిలోక్ నాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఆ ఫిర్యాదు మేరకు జేసీపై 153, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలతో జేసీ దివాకర్ రెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోోయారు. సొంత పూచీకత్తుతో పాటు నెలకు రెండు సార్లు పోలీసు స్టేషన్ కు వచ్చి సంతకాలు చేయాలని కోర్టు షరతు పెట్టింది.

న్యాయస్థానం ఆదేశాల మేరకు స్టేషన్ కు వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి పోలీసులు నిర్బంధించారనే విమర్శలు వస్తున్నాయి. ఆయన ముందస్తు బెయిల్ కోసం పోలీసు స్టేషన్ కు వచ్చారని, అయితే బెయిల్ ఇవ్వకుండా ఐదు గంటల పాటు స్టేషన్ లోనే ఉంచారని అంటున్నారు. 

సమాచారం తెలిసిన మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. పోలీసు స్టేషన్ అవరణ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు మీడియా ప్రతినిధులను హెచ్చరించినట్లు విమర్శలు వస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Birthday: సీఎం చంద్రబాబుకి నారా భువనేశ్వరి పుట్టినరోజు కానుక | Asianet Telugu
Goa Governor Ashok Gajapathi Raju Performs Sacred Rituals in Visakhapatnam | Asianet News Telugu