నా సభలకి చిన్న పిల్లలే వస్తారు.. ఎందుకంటే: తునిలో పవన్

Siva Kodati |  
Published : Jan 09, 2021, 06:05 PM ISTUpdated : Jan 09, 2021, 06:06 PM IST
నా సభలకి చిన్న పిల్లలే వస్తారు.. ఎందుకంటే: తునిలో పవన్

సారాంశం

గొడవలు, దౌర్జన్యాలు చేయడానికి తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. శనివారం తూర్పుగోదావరి జిల్లా తునిలో పర్యటించిన ఆయన దివిస్ పరిశ్రమ ఏర్పాటును నిరసిస్తూ ఆందోళన చేస్తున్న స్థానికులకు మద్ధతు పలికారు.

గొడవలు, దౌర్జన్యాలు చేయడానికి తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. శనివారం తూర్పుగోదావరి జిల్లా తునిలో పర్యటించిన ఆయన దివిస్ పరిశ్రమ ఏర్పాటును నిరసిస్తూ ఆందోళన చేస్తున్న స్థానికులకు మద్ధతు పలికారు.

తన సభలకు చిన్నపిల్లలే వస్తారని... కారణం వాళ్ల భవిష్యత్ కోసం తాను పోరాడుతున్నానని చెప్పారు. వైసీపీకి, జగన్‌కి, దివీస్‌కు తాను వ్యతిరేకం కాదని పవన్ స్పష్టం చేశారు. వాళ్ల విధానాలకు మాత్రమే వ్యతిరేకమని.. నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేస్తానని పవన్ కల్యాణ్ వెల్లడించారు.

తమకు ఎమ్మెల్యేలు లేకపోయినా పోరాటాలు చేస్తానని పవన్ స్పష్టం చేశారు. ప్రజలు నమ్మరు వదిలేయి అని చాలా మంది చెప్పారని.. నా ఇంట్లో బిడ్డలను వదిలేస్తానా..? అని జనసేనాని ప్రశ్నించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : సముద్రంలో భయంకర తుపాను.. ఈ తెలుగు జిల్లాల్లో వర్షాలు, ఎల్లో అలర్ట్
Free Bus Travel : మహిళలు, దివ్యాంగులతో పాటు వీరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం