18 మంది అభ్యర్థులను ప్రకటించిన జనసేన.. ఇక్కడి నుంచే పవన్ కల్యాణ్ పోటీ..

By Sairam IndurFirst Published Mar 24, 2024, 10:01 PM IST
Highlights

ఏపీలోని 18 అసెంబ్లీ స్థానాలకు జనసేన అభ్యర్థులను ఖరారు చేస్తూ పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం రాత్రి అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. 

ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జనసేన తన అభ్యర్థులకు సంబంధించిన జాబితా విడుదల చేసింది. పలు నియోజకవర్గాలకు 18 మంది అభ్యర్థులను ఖరారు చేస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే అవనిగడ్డ, పాలకొండ, విశాఖపట్నం దక్షిణ స్థానాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.

జనసేన అభ్యర్థుల జాబితా ఇదే..

1.  పిఠాపురం - పవన్ కల్యాణ్

2. నెల్లిమర్ల - లోకం మాధవి

3. అనకాపల్లి - కొణతాల రామకృష్ణ

4. కాకినాడ రూరల్ - పంతం నానాజీ

5. రాజానగరం- బత్తుల బలరామకృష్ణ

6. తెనాలి - నాదెండ్ల మనోహర్

7. నిడదవోలు - కందుల దుర్గేశ్

8. పెందుర్తి - పంచకర్ల రమేష్ బాబు

9. యలమంచిలి - సుందరపు విజయ్ కుమార్

10. పి.గన్నవరం - గిడ్డి సత్యనారాయణ

11. రాజోలు - దేవ వరప్రసాద్

12. తాడేపల్లిగూడెం - బొలిశెట్టి శ్రీనివాస్

13. భీమవరం - పులపర్తి ఆంజనేయులు

14. నరసాపురం - బొమ్మిడి నాయకర్

15. ఉంగుటూరు - పత్సమట్ల ధర్మరాజు

16. పోలవరం - చిర్రి బాలరాజు

17. తిరుపతి - ఆరణి శ్రీనివాసులు

18. రైల్వే కోడూరు - డా.యనమల భాస్కర రావు

ఇదిలా ఉండగా.. బీజేపీకి కూడా ఏపీలోని 6 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 

బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే..

1. అరకు - కొత్తపల్లి గీత

2. అనకాపల్లి - సీఎం రమేష్

3. రాజమండ్రి - పురందేశ్వరి

4. నరసాపురం - భూపతి రాజు శ్రీనివాస్ వర్మ 

5. తిరుపతి - వరప్రసాదరావు

6. రాజంపేట - కిరణ్ కుమార్ రెడ్డి

 

click me!