ఆంధ్రప్రదేశ్లో సిటీ బస్సులకు వైఎస్ జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి విడతగా విశాఖ, విజయవాడలో ఆర్టీసీ సిటీ బస్సులు నడపనుంది.
ఆంధ్రప్రదేశ్లో సిటీ బస్సులకు వైఎస్ జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి విడతగా విశాఖ, విజయవాడలో ఆర్టీసీ సిటీ బస్సులు నడపనుంది. శనివారం నుంచి ఈ రెండు నగరాల్లో సిటీ బస్సులు రోడ్డెక్కుతాయి.
కేంద్రం ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనలు పాటిస్తూ సిటీ బస్సులు నడపనుంది ఏపీఎస్ఆర్టీసీ. కాగా లాక్డౌన్ మొదలైన నాటి నుంచి దేశంలో సిటీ బస్సులు రోడ్డెక్కడం ఇదే మొదటిసారి.