ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇంటిపై ఐటీ దాడులు

Published : May 23, 2018, 10:25 AM IST
ఎమ్మెల్యే జ్యోతుల  నెహ్రూ ఇంటిపై ఐటీ దాడులు

సారాంశం

రాష్ట్రవ్యాప్తంగా కలకలం 

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇంటిపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ వార్త రాష్ట్రంలో కలకలం రేపింది. 
నెహ్రూ స్వగ్రామం ఇర్రిపాక నివాసంలో ఐటీ శాఖాధికారులు మంగళవారం మధ్యాహ్నం నుంచి సోదాలు నిర్వహించారు. అదే గ్రామంలో మరికొందరి ఇళ్లపై దాడులు జరిగినట్టు చెబుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు ఆదాయపన్ను శాఖ బుదవారం వెల్లడించవచ్చని అంటున్నారు. నెహ్రూ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పక్షాన ఎన్నికై టిడిపిలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. విశాఖ ఐటి అదికారులు ఈ దాడులు నిర్వహించారు

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?