బెజవాడలో ఐటీ దాడుల కలకలం.. టీడీపీ నేతల ఇళ్లపై దాడులకు పక్కా వ్యూహం..?

sivanagaprasad kodati |  
Published : Oct 05, 2018, 08:11 AM IST
బెజవాడలో ఐటీ దాడుల కలకలం.. టీడీపీ నేతల ఇళ్లపై దాడులకు పక్కా వ్యూహం..?

సారాంశం

తెలంగాణలో కలకలం రేపిన ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు మారాయి. విజయవాడలోని పలువురి ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు జరగబోతున్నాయని ప్రచారం జరుగుతుండటంతో నగరంలో కలకలం రేగుతోంది.

తెలంగాణలో కలకలం రేపిన ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు మారాయి. విజయవాడలోని పలువురి ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు జరగబోతున్నాయని ప్రచారం జరుగుతుండటంతో నగరంలో కలకలం రేగుతోంది.

ఢిల్లీ నుంచి వచ్చిన 8 ప్రత్యేక బృందాలు ఆటోనగర్‌లోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో మకాం వేశాయి. ఎవరెవరి ఇళ్లపై సోదాలు నిర్వహించాలో తెలుసుకుని.. పక్కా సమాచారంతో రంగంలోకి దిగాయి.

కొద్దిసేపటి క్రితమే ఐటీ ఆఫీస్ నుంచి దాడులు జరపబోయే ప్రముఖుల నివాసాలకు ఐటీ అధికారులు బయలుదేరినట్లుగా తెలుస్తోంది. రాజకీయ కారణాలతో టీడీపీ నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించిన కొద్దిరోజుల్లోనే దాడులు జరుగుతుండటం ప్రాధాన్యత కలిగిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Andhra Pradesh Legislative Council: తిరుమల నెయ్యి కల్తీ పైఅసెంబ్లీ లో రచ్చ రచ్చ | Asianet Telugu
CM Chandrababu Speech: ఏపీ ప్రాజెక్టులపై అసెంబ్లీలో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu