ప్రస్తుత రాజకీయాలపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

Published : Dec 09, 2018, 01:00 PM IST
ప్రస్తుత రాజకీయాలపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

ప్రస్తుత రాజకీయాలకు తాను  సరిపోనని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు


విశాఖ:  ప్రస్తుత రాజకీయాలకు తాను  సరిపోనని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. దేశంలో ఓటుకి వేలం పాట చోటు చేసుకొందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆదివారం నాడు  జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన  సేవ్ ఆంధ్రప్రదేశ్  సదస్సు లో  ఆయన మాట్లాడారు.  సంపాదించుకోవడానికే  ప్రస్తుతం రాజకీయాలను వాడుకొంటున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు.

కనీసం రూ.20 కోట్లు ఖర్చు పెడితేనే  అసెంబ్లీలో అడుగుపెట్టే  పరిస్థితి నెలకొందని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. అవినీతిపై  ప్రజల్లో చైతన్యం  తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.  ప్రతి పనిని పబ్లిసిటీ కోసం వాడుకొంటున్నారని  ఉండవల్లి అరుణ్ కుమార్  ఆవేదన వ్యక్తం చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP
విద్యార్థుల గ్రాండ్ వెల్ కమ్ కి మంత్రి నారాలోకేష్ ఫిదా | Nara Lokesh Vizianagaram School Visite