టీడీపీలో కోట్ల కలకలం: అంతుబట్టని కేఈ అంతరంగం

First Published Jan 30, 2019, 3:15 PM IST

కర్నూల్ జిల్లా టీడీపీ రాజకీయాలు మరింత వేడేక్కుతున్నాయి. కోట్ల ఫ్యామిలీ టీడీపీలో చేరే విషయం  తనతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చర్చించలేదని ఏపీ డిప్యూటీ సీఎం  కేఈ కృష్ణమూర్తి  చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. 

కర్నూల్ జిల్లా టీడీపీ రాజకీయాలు మరింత వేడేక్కుతున్నాయి. కోట్ల ఫ్యామిలీ టీడీపీలో చేరే విషయం తనతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చర్చించలేదని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. కోట్ల ఫ్యామిలీ టీడీపీలో చేరిక విషయాన్ని కేఈకి ముందుగానే సమాచారం ఇచ్చినట్టుగా టీడీపీ వర్గాలు చెబుతున్నా ఈ విషయం తనకు తెలియదని కూడ కేఈ ప్రకటించడం గమనార్హం.
undefined
కర్నూల్ జిల్లా రాజకీయాల్లో కోట్ల ఫ్యామిలీ, కేఈ ఫ్యామిలీకి మధ్య పొసగదు. కేఈ ఫ్యామిలీ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేది. ఈ రెండు కుటుంబాల మధ్య ఆధిపత్యపోరు సాగేది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీలో ఇమడలేని పరిస్థితుల్లో కేఈ కుటుంబం టీడీపీలో చేరింది.
undefined
కేఈ కృష్ణమూర్తి, చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, గులాం నబీ ఆజాద్‌లు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న సమయంలో మంచి మిత్రులుగా ఉండేవారు.హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ చనిపోయారు. గులాం నబీ ఆజాద్ మాత్రమే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. చంద్రబాబునాయుడు కాంగ్రెస్ నుండి టీడీపీలో చేరారు. ఆ తర్వాత కేఈ కృష్ణమూర్తి కూడ టీడీపీ గూటికి వచ్చారు.
undefined
కర్నూల్ జిల్లా టీడీపీ రాజకీయాల్లో కేఈ చెప్పిందే వేదంగా ఇంత కాలం పాటు నడిచింది. భూమా నాగిరెడ్డి టీడీపీలో ఉన్న సమయంలో నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కేఈ తలదూర్చకపోయేవాడని చెబుతారు. 2009 ఎన్నికల సమయంలో భూమా నాగిరెడ్డి టీడీపీని వీడి పీఆర్ఫీలో చేరారు. ఆ తర్వాత జిల్లాపై మరోసారి కేఈ కృష్ణమూర్తి చెప్పినట్టుగా బాబు నిర్ణయాలు తీసుకొనే వాడని చెబుతారు.
undefined
ఇదిలా ఉంటే తాజాగా కర్నూల్ రాజకీయాల్లో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో కోట్ల ప్యామిలీ టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంది. కోట్ల ఫ్యామిలీని టీడీపీలో చేర్చుకొనేందుకు చంద్రబాబునాయుడు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కోట్ల ఫ్యామిలీతో చర్చల కోసం టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ ను చంద్రబాబునాయుడు పంపారు.
undefined
అయితే కోట్ల ఫ్యామిలీ టీడీపీలో చేరుతున్నారనే విషయాన్ని టీడీపీ నాయకత్వం కేఈ కృష్ణమూర్తికి సమాచారం ఇచ్చినట్టు ప్రచారం సాగింది. కానీ, ఈ విషయమై తనకు సమాచారం లేదని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోమవారం నాడే స్పష్టం చేశారు. బుధవారం నాడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి బాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో శ్రీశైలం ట్రస్ట్ బోర్డు అంశానికి సంబంధించి చర్చించినట్టు కేఈ కృష్ణమూర్తి మీడియాకు వివరించారు.
undefined
కోట్ల ఫ్యామిలీ టీడీపీలో చేరిక విషయాన్ని బాబు తనతో చర్చించలేదని కేఈ తేల్చి చెప్పారు. ఈ విషయమై తాను పార్టీ నేతలతో చర్చించబోనని చెప్పారు. అయితే త చంద్రబాబునాయుడు కోట్ల ఫ్యామిలీ చేరిక విషయమై తన అభిప్రాయాన్ని అడిగితేనే తాను ఈ విషయమై తన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తానని కేఈ కృష్ణమూర్తి ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
undefined
కోట్ల ఫ్యామిలీ చేరిక విషయాన్ని పార్టీ నాయకత్వం కర్నూల్ జిల్లాకు చెందిన కొందరు నేతలతోనే చర్చించినట్టు ప్రచారం సాగుతోంది. గత ఏడాది ఆరంభంలోనే కోట్ల ఫ్యామిలీ టీడీపీలో చేరేందుకు రంగం సిద్దమైంది. ఆ సమయంలో కోట్ల ఫ్యామిలీ చేరిక విషయాన్ని కేఈతో బాబు చర్చించారు. ఆ సమయంలో కోట్ల ఫ్యామిలీ చేరిక విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆ సమయంలో కేఈ చెప్పినట్టుగా పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
undefined
కానీ, ఈ దపా కోట్ల ఫ్యామిలీ చేరిక విషయాన్ని కేఈ కృష్ణమూర్తికి సమాచారం ఇవ్వలేదా.. లేక కోట్ల ఫ్యామిలీని టీడీపీలో చేర్చుకోవడంపై అసంతృప్తితో కేఈ ఇలా మాట్లాడుతున్నారా అనేది అంతుపట్టడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
undefined
డోన్ అసెంబ్లీ సీటు విషయంలో కేఈ కుటుంబానికి, కోట్ల ఫ్యామిలీ మధ్య పోటీ సాగే అవకాశాలు లేకపోలేదు. గత ఎన్నికల సమయంలో ఈ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా కేఈ ప్రతాప్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోసారి ఈ స్థానం నుండి పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. అయితే ఇదే స్థానం నుండి కోట్ల సుజాతమ్మ పోటీ చేయాలని భావిస్తున్నారు.
undefined
బాబుతో సమావేశంలో డోన్ స్థానం విషయమై చర్చ జరిగినట్టు సమాచారం. అయితే కర్నూల్ ఎంపీతో పాటు డోన్‌కు బదులుగా ఆలూరు అసెంబ్లీ స్థానాన్ని కోట్ల ఫ్యామిలీకి ఇచ్చేందుకు బాబు సానుకూలంగా స్పందించినట్టు చెబుతున్నారు.
undefined
click me!