Tirupati: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్‌లోనే! 

Published : Apr 28, 2025, 03:02 PM IST
Tirupati: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్‌లోనే! 

సారాంశం

   

తిరుపతి జిల్లాలోని పాకాల మండలం తోటపల్లి వద్ద పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. శరవేగంగా వెళ్తోన్న ఓ కారు.. ప్రమాదవశాత్తు లారీ  కంటైనర్‌ కిందకు దూసుకెళ్లింది.

ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

స్థానికులు క్షతగాత్రుల్ని సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Jana Sena 13th Formation Day: వినూత్నంగా జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు| Asianet News Telugu
AP Food Commission Chairman: ఉప్మాలో పురుగులు ఫిర్యాదు చేసిన పేరెంట్స్| Asianet News Telugu