జగన్ విక్టరీ ఎఫెక్ట్: టీటీడీ పాలకమండలి సమావేశం రసాభాస

By Siva KodatiFirst Published May 28, 2019, 10:38 AM IST
Highlights

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంగళవారం ఉదయం టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన పాలకమండలి సమావేశం ప్రారంభమవ్వగానే... బోర్డు మెంబర్ పదవికి తెల్లబాబు రాజీనామా చేసి లేఖను ఈవో సింఘాల్‌కు అందజేశారు.

ఈ క్రమంలో సభ్యుల మధ్య వాగ్వాదం జరగడంతో సమావేశం రసాభాసగా మారింది. దీంతో ఈవో సింఘాల్‌తో పాటు జేఈవో శ్రీనివాసరాజు సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. 

click me!