నష్టమే కదా: అమరావతిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు

Published : Aug 06, 2020, 01:30 PM IST
నష్టమే కదా: అమరావతిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు

సారాంశం

ఏపి రాజధాని అమరావతిపై ఏపీ హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకు నిర్మించిన భవనాలు వాడుకోకపోతే నష్టం జరుగుతుంది కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఖర్చుల వివరాలు కూడా అడిగింది.

న్యూఢిల్లీ: రాజధాని పిటిషన్లపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. రాజధాని నిధుల వ్యయానికి సంబంధించిన అంశం త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. పిటీషన్‌‌లపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది..ఇప్పటి వరకూ 52వేల కోట్ల రూపాయల వ్యయం చేశారని సీఆర్డీఏ రికార్డును హైకోర్టు న్యాయవాది ఉన్నం మురళీధర్ చూపించారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. 

‘నేటివరకు ఎంత ఖర్చు చేశారు? ఎక్కడ ఆ నిర్మాణం ఆగింది?’ తదితర వివరాలు కావాలని ఆదేశించింది. ఇది ప్రజల సొమ్ము.. రాష్ట్ర ఖజానాకు నష్టమే కదా...? అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘బిల్డింగ్‌లు ఎన్ని పూర్తయ్యాయి..?.ఎక్కడ ఆగిపోయాయి...? ఎంత వ్యవయం చేశారు..? కాంట్రాక్టర్లకు ఎంత డబ్బులివ్వాలి..?’ వంటి వివరాలన్నీ వెంటనే సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.

నిర్మించిన భవనాలను వాడుకోకపోతే, అవి పాడైపోతాయి కదా... ఆ నష్టం ఎవరు భరిస్తారని ప్రశ్నించింది. రాష్ట్ర అకౌంటెంట్ జనరల్‌కు వెంటనే నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ డబ్బులు ఎక్కడ నుంచి తీసుకువచ్చారు? 52 వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్‌లు ఏ దశలో ఉన్నాయో కూడా వివరాలు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసు విచారణను ఈ నెల 14వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

PREV
click me!

Recommended Stories

వెన్నుపోటు పరిపాలన: మార్గాన్ని భరత్ | Margani Bharat Fires on Chandrababu | Asianet News Telugu
Jogi Ramesh Open Challenge: టైం, డేట్ చెప్పు నేను రెడీ లోకేష్ కి జోగిరమేష్ ఛాలెంజ్| | Asianet Telugu