ఏలూరు జిల్లా : రెస్టారెంట్‌పై పేలిన హీలియం బెలూన్.. చిన్నారులకు గాయాలు

Siva Kodati |  
Published : Dec 27, 2022, 05:40 PM IST
ఏలూరు జిల్లా : రెస్టారెంట్‌పై పేలిన హీలియం బెలూన్.. చిన్నారులకు గాయాలు

సారాంశం

ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో ఓ రెస్టారెంట్‌పై ఏర్పాటు చేసిన హీలియం బెలూన్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు తీవ్రగాయాల పాలయ్యారు.   

ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో హీలియం గ్యాస్ బెలూన్ పేలింది. ఓ రెస్టారెంట్‌పై హీలియం గ్యాస్ బెలూన్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఈ క్రమంలో మంగళవారం బెలూన్ పేలి.. మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే విజయవాడ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీస్ శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.  
 

PREV
click me!

Recommended Stories

వొళ్ళు గగురు పుట్టే విన్యాసాలతో అదరగొట్టిన పోలీస్ సిబ్బంది | Nara Lokesh | Independence Day | Stunts
ఈ బైకర్ విన్యాసాలకి మంత్రి నారా లోకేష్ ఫిదా | Nara Lokesh Particepate Independence Day Celebrations