ఏలూరు జిల్లా : రెస్టారెంట్‌పై పేలిన హీలియం బెలూన్.. చిన్నారులకు గాయాలు

Siva Kodati |  
Published : Dec 27, 2022, 05:40 PM IST
ఏలూరు జిల్లా : రెస్టారెంట్‌పై పేలిన హీలియం బెలూన్.. చిన్నారులకు గాయాలు

సారాంశం

ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో ఓ రెస్టారెంట్‌పై ఏర్పాటు చేసిన హీలియం బెలూన్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు తీవ్రగాయాల పాలయ్యారు.   

ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో హీలియం గ్యాస్ బెలూన్ పేలింది. ఓ రెస్టారెంట్‌పై హీలియం గ్యాస్ బెలూన్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఈ క్రమంలో మంగళవారం బెలూన్ పేలి.. మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే విజయవాడ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీస్ శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.  
 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి మొహర్రం సెలవు ఉన్నట్లా, లేనట్లా? క్లారిటీ వచ్చేదెలా?
Gade Sai Krishna Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం సీఐ నాగరాజు అరెస్ట్ | Asianet News Telugu