కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు: పొంగిపోర్లుతున్న వాగులు.. స్తంభించిన రాకపోకలు

Siva Kodati |  
Published : Jun 27, 2021, 03:19 PM IST
కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు: పొంగిపోర్లుతున్న వాగులు.. స్తంభించిన రాకపోకలు

సారాంశం

కర్నూలు జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

కర్నూలు జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కోడుమూరు మండలం వరుకూరు దగ్గర తుమ్మల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో హెచ్‌పీ గ్యాస్ లారీ వాగులో చిక్కుకుపోయింది. లారీ డ్రైవర్‌ను అతి కష్టం మీద తాళ్ల సహాయంతో బయటకు లాగారు స్థానికులు. మరోవైపు కర్నూలు- ఆదోనీ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

మంత్రాలయం మండలం రచ్చమరి దగ్గర భారీ వర్షాలకు వాగులు, వంకలు పోర్లుతున్నాయి. సీడ్ పత్తిపంట, ఉల్లి వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. నందవరం-నాగుల దిన్నె మధ్య వాగు ఉద్ధృతి కారణంగా రాకపోకలు అంతరాయం ఏర్పడింది. గోనెగండ్ల మండలం హెచ్ కైరావాడిలో ఇళ్లల్లోకి వర్షపునీరు చేరుకుంది. ఎమ్మిగనూరులో ముకతిపేట, లక్ష్మీనగర్, శివన్ననగర్ , వీవర్స్ కాలనీలోకి వర్షపు నీరు చేరి మగ్గాలు తడిశాయి. దీంతో చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. నందవరంలో ఎస్సీ కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. 
 

PREV
click me!

Recommended Stories

Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి
IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!