దేవాలయాలపై ఆగని దాడులు...తూ.గో జిల్లాలో హనుమాన్ విగ్రహం ధ్వంసం (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Sep 17, 2020, 11:29 AM ISTUpdated : Sep 17, 2020, 11:31 AM IST
దేవాలయాలపై ఆగని దాడులు...తూ.గో జిల్లాలో హనుమాన్ విగ్రహం ధ్వంసం (వీడియో)

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ దేవాలయాలపై దుండగుల దాడులు ఆగడంలేదు. 

ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ దేవాలయాలపై దుండగుల దాడులు ఆగడంలేదు. మొన్న అంతర్వేది, నిన్న నిడమానూరులో పవిత్రంగా భావించే దేవాలయాలపై దాడులు జరగ్గా నేడు తూర్పు గోదావరి జిల్లాలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఏలేశ్వరం మండలంలో శివాలయం దగ్గరలో గల సీతారామాంజనేయ వ్యాయామ కళాశాల వద్దగల ఆంజనేయ స్వామి విగ్రహం చేయిని దుండగులు విరగ్గొట్టారు. 

వీడియో

ఈ ఘటనతో మరోసారి హిందూ సంఘాలు, భక్తులు ఆందోళనకు దిగారు. హనుమాన్ చెయి విరగగొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే తూ.గో జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు పైల సుభాష్ చంద్రబోస్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘటనా స్థలానికి వెళ్లి విగ్రహాన్ని పరిశీలించారు.  పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని డిమాండ్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu