బాబు లేని టైం చూసి ఇలా చేస్తారా: ఎంపీలపై జయదేవ్ ఫైర్

By Siva KodatiFirst Published Jun 20, 2019, 9:19 PM IST
Highlights

టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరడంపై న్యాయసలహా తీసుకుంటామన్నారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతనైన నా అనుమతి, పార్టీ అధినేతకు సమాచారం లేకుండా జరిగిన ఈ విలీనం చెల్లదన్నారు. 

టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరడంపై న్యాయసలహా తీసుకుంటామన్నారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతనైన నా అనుమతి, పార్టీ అధినేతకు సమాచారం లేకుండా జరిగిన ఈ విలీనం చెల్లదన్నారు.

చంద్రబాబు లేని సమయంలో ఇలా చేయడం సరికాదని జయదేవ్ అన్నారు. పార్టీ పెట్టిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొందని ఆయన తెలిపారు. రాజకీయాల్లో గెలుపొటములు సహజమని.. ఈ ఎన్నికల్లో టీడీపీ 40 శాతం ఓట్లు పొందిందన్నారు. ఈ సంక్షోభాన్ని గట్టి ఎదుర్కొంటామని జయదేవ్ స్పష్టం చేశారు.

click me!