నరసరావుపేట: కోటీ ఇరవైలక్షలు ఎగ్గొట్టి... రాత్రికి రాత్రే రాజస్థానీ కుటుంబం పరార్ (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Sep 16, 2021, 01:50 PM ISTUpdated : Sep 16, 2021, 01:55 PM IST
నరసరావుపేట: కోటీ ఇరవైలక్షలు ఎగ్గొట్టి... రాత్రికి రాత్రే రాజస్థానీ కుటుంబం పరార్ (వీడియో)

సారాంశం

ఏకంగా కోటీ ఇరవై లక్షలు అప్పు ఎగ్గొట్టి రాత్రికి రాత్రే ఓ రాజస్థానీ కుటుంబం పరారయిన సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

గుంటూరు: ఉత్తరాదినుండి వ్యాపారం చేసుకోడానికి వచ్చిన ఓ కుటుంబం కొన్నేళ్ళుగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో నివాసముంటోంది. స్థానికంగా మంచి పరిచయాలు పెంచుకున్న సదరు కుటుంబం వ్యాపార కోసమంటూ భారీగా అప్పులు తీసుకున్నారు. తాజాగా అప్పులన్నీ ఎగ్గొట్టి రాత్రికి రాత్రి పరారయ్యారు. దీంతో వారికి అప్పిచ్చినవారు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించగా ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెళితే... రాజస్థాన్ కు చెందిన ఓ కుటుంబం గుంటూరు జిల్లా నరసరావుపేటలో రావిపాడు రోడ్ లో సీజనల్ గా గణపతి విగ్రహాలు, ఆ తర్వాత వేరే విగ్రహాలను కూడా తయారుచేసి అమ్ముతుంటుంది. గత ఐదేళ్లుగా వీరు ఇక్కడే వుంటూ వ్యాపారం చేస్తుండటంతో పట్టణంలో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. దీంతో వ్యాపారంలో పెట్టుబడి కోసమంటూ స్థానికుల వద్ద దాదాపు కోటీ ఇరవైలక్షలు అప్పుచేశారు.  

వీడియో

అయితే ఈ కుటుంబం భారీగా గణపతి విగ్రహాలను తయారుచేసినప్పటికి అవి అమ్ముడుపోలేదు. దీంతో అప్పులు తీర్చే మార్గం లేకుండా పోయింది. దీంతో తయారుచేసిన వినాయకుడి విగ్రహాలను అక్కడే వదిలిపెట్టి రాత్రికి రాత్రే కుటుంబం పరారయ్యింది. ఈ విషయం తెలిసి వారికి అప్పిచ్చిన వారు ఆందోళనకు గురవుతున్నారు. 

ఈ రాజస్థాని కుటుంబం చేతిలో మోసపోయిన వారంతా పోలీసులను ఆశ్రయించారు. బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసలు పరారయిన కుటుంబం కోసం గాలిస్తున్నారు. వారు సొంత రాష్ట్రానికి వెళ్లిపోయి వుంటారని భావిస్తున్న పోలీసులు అక్కడి పోలీసులకు సమాచారమిచ్చారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో ఆవర్తనం.. ఈ రెండ్రోజులు ప్రమాదకరమైన వర్షాలు, ఆరు జిల్లాలకు అలర్ట్
Kandula Durgesh: అసెంబ్లీ లో కందుల దుర్గేష్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu