కృష్ణానదిలో నలుగురు విద్యార్థుల గల్లంతు

By narsimha lodeFirst Published Aug 22, 2018, 10:54 AM IST
Highlights

గుంటూరు జిల్లా అమరావతికి సమీపంలోని గుండమెడ క్వారీ వద్ద కృష్ణా నదిలో నలుగురు విద్యార్థులు బుధవారం నాడు ఉదయం గల్లంతయ్యారు.

అమరావతి: గుంటూరు జిల్లా అమరావతికి సమీపంలోని గుండమెడ క్వారీ వద్ద కృష్ణా నదిలో నలుగురు విద్యార్థులు బుధవారం నాడు ఉదయం గల్లంతయ్యారు.

గుండిమెడ క్వారీ వద్ద  కృష్ణా నదిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉంది.  దీంతో  ఈ వరదలో విద్యార్థులు కొట్టుకుపోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే  స్థానికులు, అధికారులు  వరదలో కొట్టుకుపోయిన  విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కృష్ణానదిలో  వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. వరద ప్రవాహన్ని తక్కువ అంచనా వేయడంతో విద్యార్థులు గల్లంతయ్యారని అనుమానిస్తున్నారు.
 

click me!