అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి

Published : Mar 02, 2021, 07:06 AM IST
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి

సారాంశం

 జిల్లాలోని పెనుగొండ మండలంలోని కియా పరిశ్రమ సమీపంలో మంగళవారం నాడు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. స్పీడ్ బ్రేకర్ వద్ద నెమ్మదిగా వెళ్తున్న లారీని కారు వేగంగా ఢీకొట్టింది. మృతుల్లో ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులున్నారు.


అనంతపురం: జిల్లాలోని పెనుగొండ మండలంలోని కియా పరిశ్రమ సమీపంలో మంగళవారం నాడు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. స్పీడ్ బ్రేకర్ వద్ద నెమ్మదిగా వెళ్తున్న లారీని కారు వేగంగా ఢీకొట్టింది. మృతుల్లో ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులున్నారు.

బెంగుళూరు నుండి హైద్రాబాద్ కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. మృతులంతా ఢిల్లీకి చెందినవారిగా గుర్తించారు. విషయం తెలుసుకొన్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Reddappagari Madhavi Reddy Satirical Comments On YSRCP Party | Asianet News Telugu
School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇలా స్కూళ్లు రీఓపెన్ కాగానే అలా సెలవులు.. ఎన్నిరోజులో తెలుసా?