దారుణం : శ్యామ్ హత్య కేసులో నలుగురు అరెస్ట్.. తల్లి, అక్క, బావలే... !!

By AN TeluguFirst Published May 28, 2021, 10:29 AM IST
Highlights

విశాఖ పట్నం యువకుడి అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడిపోయింది. యువకుడిది హత్యేనని పోలీసులు నిర్థారించారు. మహారాణి పేట పరిధి, తాడివీధికి చెందిన టేకుమూడి శ్యామ్ (21) గత ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.  

విశాఖ పట్నం యువకుడి అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడిపోయింది. యువకుడిది హత్యేనని పోలీసులు నిర్థారించారు. మహారాణి పేట పరిధి, తాడివీధికి చెందిన టేకుమూడి శ్యామ్ (21) గత ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.  

30 వ వార్డు కార్పొరేటర్ అప్పలకొండ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన మహారాణిపేట సిఐ జి. సోమశేఖర్ యువకుడిది హత్యగా నిర్ధారణకు వచ్చారు. యువకుడిని అతని తల్లి సుగుణ, సోదరి లక్ష్మీదుర్గ అలియాస్ ఫాతిమా తో పాటు, ఆమె భర్త షేక్‌ పీర్‌సాహెబ్,  సుగుణ మరో చిన్నల్లుడు ఉప్పరపల్లి అంకిత్‌  సహకారంతో ఈ హత్య చేసినట్లు గుర్తించారు.

గురువారం నిందితులు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. సీఐ సోమశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం పెద్ద కుమార్తె లక్ష్మీదుర్గా అలియాస్‌ ఫాతిమా ఆరోగ్యం బాగా లేదని వారం రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. సుగుణ కొడుకు శ్యాం కుమార్ మూడేళ్లుగా  బైక్ కొనమని వేధిస్తుండడంతో.. నాలుగు నెలల క్రితం ఫైనాన్స్ మీద బైక్ కొనిచ్చింది.

వ్యసనాలకు అలవాటు పడ్డ శ్యాం నెల రోజుల క్రితం బైక్ ను తాకట్టు పెట్టాడు. ఆ బైక్ ను విడిపించి ఇమ్మని ప్రతిరోజూ గొడవపెడుతున్నాడు. ఆదివారం రాత్రి మద్యం తాగి వచ్చిన శ్యామ్ తల్లి సుగుణను, సోదరి ఫాతిమాను విపరీతంగా వేధించాడు. దీంతో సుగుణ ఆమె ఇద్దరి అల్లుళ్లతో ముందుగానే ప్లాన్‌ చేసుకోవటంతో పెద్దల్లుడు షేక్ పీర్ సాహెబ్, చిన్నల్లుడు ఉప్పరపల్లి అంకిత్‌ ఇంటికి చేరుకున్నారు. 

శ్యామ్ నిద్రపోయిన తర్వాత అల్లుళ్లు ఇద్దరు ఒకరు శ్యామ్ కాళ్ళమీద నిలుచుండగా, ఒకరు చేతులు గట్టిగా పట్టుకున్నారు. కూతురు ఫాతిమా తలగడ ముఖం పై వేసి నొక్కి పట్టుకుంది. సుగుణ ట్రాక్‌ నాడా తాడు తీసుకుని మెడ చుట్టువేసి బిగించడంతో శ్యామ్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పోలీసులు నిందితుడు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.

click me!