అనంతపురం: మంటల్లో కాలిబూడిదైన ఏటీఎం.. ఎంత డబ్బుందంటే..?

Siva Kodati |  
Published : Apr 10, 2021, 03:17 PM IST
అనంతపురం: మంటల్లో కాలిబూడిదైన ఏటీఎం.. ఎంత డబ్బుందంటే..?

సారాంశం

అనంతపురం జిల్లా పామిడిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎంలో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి ఏటీఎం కేంద్రం అద్దాలు పగిలిపోయాయి. అగ్నిప్రమాదంలో ఏటీఎం మిషన్ పూర్తిగా కాలిపోయింది

అనంతపురం జిల్లా పామిడిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎంలో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి ఏటీఎం కేంద్రం అద్దాలు పగిలిపోయాయి. అగ్నిప్రమాదంలో ఏటీఎం మిషన్ పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి  వుంది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని భావిస్తున్నారు. అలాగే ఏటీఎంలో ఎంత డబ్బుందనే దానిపై క్లారిటీ రావాల్సి వుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Rain Alert : రుతుపవనాలు వచ్చేస్తున్నాయి... తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు
Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !